దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో బీజేపీ తెలంగాణలో పాతుకు పోవటానికి శతవిధాల ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కచ్చితంగా జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో వంద స్థానాలకు పైగా గెలవటం గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బిజెపి పార్టీ తరఫున గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో ప్రచారం కోసం పార్టీ అగ్రనేతలు హైదరాబాద్ కి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కోటి విషయంలోకి వెళ్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్ ఈ ఎన్నికల ప్రచారంలో కి రానున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ నాయకులకు సంబంధించిన అనుచరులను హైదరాబాద్ కి పంపినట్లు సమాచారం. బీజేపీ హైకమాండ్ ఒక్కొక్క నేత కి 30 నుండి 40 డివిజన్లు అప్ప చెప్పటంతో స్థానికంగా అక్కడ ఉన్న సమస్యలను ఈ కీలక నాయకుల అనుచరులు తెలుసుకుని ఓ నివేదిక రెడీ చేస్తున్నట్లు… టిఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి జండా ఎగరాలని కాషాయ దళం పెద్దలు కంకణం కట్టుకున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ నాయకులు మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో మరికొంత మంది కీలక నేతలు గ్రేటర్ ఎన్నికల బరిలో పార్టీ తరఫున ప్రచారానికి రాబోతున్నట్లు జాతీయ స్థాయిలో టాకు వస్తుంది. ముఖ్యంగా వరదల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎండగట్టాడానికి.. కేంద్రం తరఫున వరద సాయాన్ని నగర ప్రజలకు భారీ స్థాయిలో ఇచ్చే రీతిలో బిజెపి నేతలు ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.