వాషింగ్టన్: పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. దాడిని భయానక చర్యగా ఆయన అభివర్ణించారు.
‘‘దాడిపై మాకు నివేదికలు అందాయి. నేను వాటిని పరిశీలించాను. అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. సరైన సమయంలో దీనిపై స్పందిస్తాం. రెండు దేశాలు (పాకిస్థాన్, ఇండియా) కలిసి నడిస్తే బాగుంటుంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
శ్వేతసౌధానికి చెందిన ఉన్నతాధికారి, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ జాన్బోల్టన్ మాట్లాడుతూ.. దాడులపై భారత్తో చర్చించామన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో దేశానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ దాడిపై విచారణకు పాకిస్థాన్ పూర్తి సహకారం అందించాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దేశంతోనూ చర్చలు జరిపామన్నారు. వైట్హౌస్లోని ఇతర విభాగాలు సైతం దాడిని తీవ్రంగా ఖండించాయి.