TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది.. సీనియర్ సిటిజన్లకు 30 నిమిషాల్లోనే ఉచిత దర్శనం చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.. ఈ ప్రత్యేక దర్శనం కోసం రెండు సమయాలను కేటాయించినట్లు తెలిపారు..!!
TTD: సీనియర్ సిటిజన్లకు 30 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం..!!
60 సంవత్సరాల పైబడిన వారు ఉదయం 10 గంటలకు, సాయంత్రం మూడు గంటలకు శ్రీవారి ని ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ దర్శనానికి వచ్చే భక్తులు ఫోటోతో పాటు ఐడెంటిటీ ప్రూఫ్ తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకుని S -1 కౌంటర్ వద్ద చూపించాలి. ఈ దర్శనం కోసం మిగతా నిలిపివేస్తారు ఎటువంటి ఒత్తిడి లేకుండా 30 నిమిషాలలో వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తవుతుంది.
ఆలయానికి కుడి వైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే కూర్చొడానికి చక్కని సీట్లు ఏర్పాటు చేశారు. సాంబార్ అన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా అందిస్తారు. 20 రూపాయలకే రెండు లడ్డూ టోకెన్లు ఇస్తారు. ఇంకా కావాలి అనుకుంటే ఒక్కొక్క లడ్డు టోకెన్ 25 రూపాయల చొప్పున తీసుకోవచ్చు. కౌంటర్ నుంచి కుడికి కుడి నుంచి కౌంటర్ వరకు బ్యాటరీ కారు లో ఉచితంగా తీసుకెళ్తారు. ఇప్పటి నుంచి సీనియర్ సిటిజన్ భక్తులు కేవలం ముప్పై నిమిషాలలో ని ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.
టీటీడీ తీసుకున్న నిర్ణయం పట్ల వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా మంచి నిర్ణయమని పేర్కొంటున్నారు. సందర్భంగా సీనియర్ సిటిజన్ సంఘాల నేతలు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.