దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. దాదాపుగా 200 మంది ఉగ్రవాదులు కర్ణాటక, కేరళ సహా దక్షిణ భారతదేశంలో దాడులకు పాల్పడవచ్చినని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఐసిస్ ఉగ్రవాద సంస్థ భారత్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్, మయన్మార్ కు చెందిన కొందరిని ఎంపిక చేసుకుని వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు భారత భూభాగంలోకి పంపిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అల్ ఖైదా హెడ్ ఆసీం ఉమర్ చనిపోయాక ఒసామా మొహమ్మద్ ఆ బాధ్యతలను చేపట్టాడని, ఉమర్ చావుకు ప్రతీకారంగానే ఈ దాడులు జరగబోతున్నాయని హెచ్చరించింది. తాలిబన్ల హస్తం కూడా ఉంటుందని తెలిపింది. ఇండియన్ ప్రావిన్స్ పేరిట ఈ గ్రూప్ పనిచేస్తుందని, కాబట్టి భారతదేశం హై అలెర్ట్ లో ఉండాలని ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు జారీ చేసింది.