Vaishnav tej: వైష్ణవ్ తేజ్ – క్రిష్ కాంబినేషన్లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కోవిడ్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ క్రిష్ ఈ సినిమాను కేవలం 50 రోజులలోనే షూటింగ్ పూర్తి చేశాడు. అయితే ఉప్పెన తర్వాత స్టార్ హీరోగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ రెండవ సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేయడంతో ఇండస్ట్రీ వర్గాలలో అలాగే ప్రేక్షకుల్లో ఊహకందని విధంగా అంచనాలు పెరిగాయి. సంక్రాంతి నుంచి ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
సమ్మర్లోపు వైష్ణవ్ తేజ్ – క్రిష్ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. మేకర్స్ కూడా అదే ప్లాన్ చేశారు. కానీ ఈలోపు కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్నీ సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి. ఇక ఇదే కారణంతో థియేటర్స్ క్లోజ్ అవడంతో రిలీజ్ కావాల్సిన సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇటీవలే మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేయడంతో చిన్న సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా, పుష్ప సినిమా డిసెంబర్లో రిలీజ్ కానుంది.
Vaishnav tej: వైష్ణవ్ తేజ్ – క్రిష్ మూవీ అక్టోబర్ 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ – రానా, మహేష్ బాబు, ప్రభాస్, వెంకటేశ్, వరుణ్ తేజ్ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వైష్ణవ్ – క్రిష్ సినిమా కూడా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభించనున్నారట. అలాగే ఈ సినిమాకి కొండపొలం అనే టైటిల్ ప్రకటించనున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత మరో టైటిల్ కూడా ప్రచారం జరిగింది. మళ్ళీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం కొండపొలం టైటిల్ నే ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా మీద రకుల్ చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఇది హిట్ అయితే తెలుగులో మళ్ళీ అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది.