Allu Arjun ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో చిన్న సినిమాలు చేయడానికి పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరూ మొగ్గు చూపడం లేదు. అయితే మల్టీస్టారర్లు…. కుదరకపోతే పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. కథ బాగుంటే మాత్రం ఎంత బడ్జెట్ పెట్టడానికైనా వెనుకాడడం లేదు. ఇదే సమయంలో తెలుగు లో స్టైలిష్ హీరోలు అయిన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ పై అనేక కథనాలు వస్తున్నాయి. తొలిసారి వీరిద్దరూ స్క్రీన్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Allu Arjun పుష్ప…. విజయ్ లైగర్
ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒకవైపు అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాతో తన తొలి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక వీరిద్దరినీ ఒకే స్క్రీన్ పై చూపించబోయే డైరెక్టర్ మహి వి రాఘవ్ అని తెలుస్తోంది. ఇదివరకు తాప్సీతో రాఘవ్ ఆనందోబ్రహ్మ చేశాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ‘యాత్ర’ సినిమా తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తాను రాసుకున్న ఈ మల్టీ స్టారర్ ఇదివరకే ఇతర హీరోలకు రాఘవ్ చెప్పాడట.
అయితే వారు రిజెక్ట్ చేసినప్పుడల్లా మార్పులు చేసుకుంటూ వచ్చిన రాఘవ్ సినిమాపై గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. మొదట్లో నాని, విశాల్ తదితర హీరోలను ఈ కథకు అనుకున్నాడట. అయితే ఇద్దరు హీరోలు కూడా ఈ కథలో మార్పులు చెప్పడంతో దర్శకుడి ఆలోచన కూడా మారింది అని అంటున్నారు. ఈ సినిమాను పెద్ద హీరోలతో చేస్తే బాగుంటుందని అతను ఆలోచించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో స్టార్ హీరోలు అయితేనే ఈ కథకు న్యాయం చేయగలరని ఫిక్స్ అయ్యాడు.
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను ఇప్పటికే దేవరకొండ, అల్లు అర్జున్ లకు చెప్పాడట. వారూ పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. ఇక దీనిలో మరిన్ని మార్పులు చేసేందుకు కొంత మంది రైటర్స్ తో సిట్టింగ్ వేసినట్లు సమాచారం. పూర్తి స్క్రిప్ట్ వినిపించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ యోచనలో మహి వి రాఘవ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి