ఒంగోలు: బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ఒక ప్రజాప్రతినిధి ట్వీట్ను రీట్వీట్ చేయటం హాట్ టాపిక్గా మారింది.
రెండు రోజుల క్రితం మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపిని వీడి వైసిపి అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. చేరిక సందర్భంగా జగన్తో ఉన్న ఫొటోను మాగుంట ట్వీట్ చేశారు.
మాగుంట చేసిన ట్వీట్ను విజయ్ మాల్యా రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెటిజన్ల కంటపడటంతో ట్రోలింగ్ మొదలు పెట్టారు.
జగన్ను, వైసిపిని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. బిజెపి, వైసిపి రహస్య బంధం బయటపండిందని, దొంగలంతా ఒక దగ్గరే చేరారని తెగ ట్రోల్ చేస్తున్నారు. జగన్ లండన్ పర్యటన గురించి కూడా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
వైసిపిలో చాలా మంది చేరారు. కానీ మాల్యా మాత్రం మాగుంట ట్వీట్కే ఎందుకు స్పందించాడా అని అంతా ఆలోచనలో పడ్డారు.
మాల్యా, మాగుంట మధ్య లిక్కర్ కలిపిన బంధం ఉంది. మాగుంటకు లిక్కర్ బిజినెస్ ఉంది. మాల్యా కూడా అదే వ్యాపారం చేశారు. కాబట్టి ఇద్దరికి పరిచయాలు ఉండొచ్చు. ఏది ఏమైనా మాల్యా లండన్లో ఉన్నా భారత దేశంలోని పాత మిత్రులను మాత్రం మర్చిపోలేకపోతున్నారు.