మెగాస్టార్ చిరంజీవి కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో ఆచార్య సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లో 152వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ క్రియోట్ చేయాలని కొరటాల పట్టుదలగా ఉన్నాడు. కాగా మంచి సామాజిక అంశంతో పాటు సందేశం ఉన్న సినిమా ఆచార్య తెరకెక్కుతుంది.
అయితే మెగాస్టార్ గత చిత్రం సైరా వచ్చి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. వాస్తవంగా అయితే ఇంత లాంగ్ గ్యాప్ లేకుండానే ఆచార్య ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కాని కరోనా మూలంగా ఈ సినిమా చాలా డిలే అయిపోయింది. దాంతో ఖచ్చితంగా తెలుగు వాళ్ళ పెద్ద పండుగ సంక్రాంతి కాబట్టి ఆ సీజన్ అన్ని విధాలా బావుంటుంది కాబట్టి 2021 సంక్రాంతికి ఆచార్య వస్తుందని భావిస్తున్నారు.
కాని ఒక్క విషయం అందరూ మరిచిపోయారు. ఆచార్య విషయంలో మేకర్స్ చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ సినిమా 2021 సమ్మర్ అని ఆచార్య మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే అధికారకంగా ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి సీజన్ లో రిలీజయ్యే సినిమాలతో పోల్చుకొని చూస్తూ ఆచార్య సంక్రాంతికి రావడం కష్టమే.. అంటూ రక రకాల వార్తలు రాస్తున్నారు. మేకర్స్ ఇంత క్లారిటీగా ఉన్నా కూడా ఇలా రాసే వాళ్ళకి ఏమైంది అని ఫ్యాన్స్ సెటైర్స్ వేసుకుంటున్నారట.
ఈ సినిమా తర్వాత మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలలో నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన న్యూస్ కూడా ఇప్పటికే వచ్చేశాయి. ఈ సినిమాలలో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా రూపొందుతుంది. మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన అక్టోబర్ లో రానుందని సమాచారం. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో కూడా మెగాస్టార్ నటించబోతున్నారు.