YS Viveka Case: వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ల బెయిల్ పిటిషన్ లను హైకోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ ఏప్రిల్ మూడవ వారంలో అరెస్టు చేసింది ప్రస్తుతం వీరు చంచల్ గూడ జైలులో ఉన్నారు. వీరి బెయిల్ ను సీబీఐ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
వీరి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోరగా, మూడు రోజుల క్రితం కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ .. బెయిల్ మంజూరు చేయవద్దంటూ వాదనలు వినిపించింది. నిందితులు చాలా పలుకుబడి కల్గిన వ్యక్తులనీ, కేసులో వీరు ప్రధాన నిందితులనీ, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేయవద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. సీబీఐ బలమైన వాదనలు వినిపించింది. ఈ క్రమంలో భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ లను హైకోర్టు తిరస్కరించింది.
Congress: మా దగ్గర ఆ పప్పులు ఉడకవు .. ఎంట్రీ ఇవ్వకుండానే వైఎస్ షర్మిల గాలి తీసేసిన సోనియా గాంధీ !