YS Sharmila: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సీఎం జగన్ టికెట్ ఎలా ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీగా అభ్యర్ధిగా పోటీ చేస్తున్న షర్మిల కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవేళ కడప పెద్ద (అమీన్ పీర్) దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాసాపేట సర్కిల్, దేవుని కడప, అశోక్ నగర్, అప్సరా సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ఐటీఐ సర్కిల్, మరియాపురం, వినాయక్ నగర్, అల్మాస్పేట, చిలకలబావి, ఏడు రోడ్స్ మీదుగా బస్సు యాత్ర సాగింది.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో షర్మిల .. వివేకా హత్య కేసు అంశాన్ని ప్రధాన అస్త్రంగా ప్రసంగించారు. వివేకా హత్య కేసులో అవినాష్ ను సీబీఐ నిందితుడిగా తేల్చిందని అన్నారు. బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని కోరారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారికి ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. దొంగలు దొంగలు బుజాలు తరుముకున్నట్లు అవినాష్ తీరు ఉందని అన్నారు. అవినాష్ త్యాగమూర్తి అయితే హంతకులతో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి అని ప్రశ్నించారు. నిందితులతో కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నట్లు అని ప్రశ్నించారు. హత్య మీరు చేయక పోతే సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారు అని ప్రశ్నించారు. న్యాయం చేయాల్సిన సొంత ఆన్న చెల్లెళ్లపై నిందలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘హంతకులను చట్టసభలకు పంపొద్దని నేను ఎంపీ గా పోటీ చేస్తున్న.. అవినాష్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేము బురద జల్లుతున్నం అంట. మా విజ్ఞతకు వదిలేస్తాడాట. ఇన్ని మాటలు చెప్పే బదులు కేసులో సంబంధం లేదు అని చెప్పొచ్చు కదా..గూగుల్ మ్యాప్స్ కి మీకు సంబంధం లేదు అని చెప్పొచ్చు కదా.. మీ కాల్ రికార్డ్స్ హంతకుల ఫోన్ రికార్డ్స్ తో ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి చెప్పండి..హంతకులకు మీకు సంబంధాలు ఎందుకు ఉన్నాయి చెప్పండి అని షర్మిల అన్నారు.
ఇళ్లంతా రక్తం ఉంటే హార్ట్ ఏటాక్ తో చనిపోయారు అని ఎందుకు అబద్దం ఆడారో చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మన నాయకులు. ఒకరోజు ఇదే అవినాష్ రెడ్డి కోసం నేను ఒప్పుకున్నా. వివేకా నన్ను పోటీ చేయాలని అడిగితే వద్దు అని చెప్పిన దాన్ని నేను. నేను ఎంపీ సీట్ కావాలి అనుకుంటే నాకు ఆరోజే వచ్చేది కాదా ?. అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని భలపరిచింది నేను. జగన్ కోసం 3200 కిలీ మీటర్లు పాదయాత్ర చేశా. ఒక్కరోజు కూడా పదవి కావాలని అడగలేదు. ఇవ్వాళ ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. కనికరం లేకుండా మాట్లాడుతున్నారు. సునీతను, నన్ను అవమానిస్తున్నారు. నేను వైఎస్ షర్మిలా రెడ్డి కాదట…నేను వైఎస్ కి పుట్టలేదట. వివేకా ను సునీతా రెడ్డి హత్య చేయించింది అని నిందలు మోపారు. ఎన్ని మాట్లాడిన నేను భరించినా.. నిందలు మోపినా భరించా. అహంకారం తో మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకా నాకు చిన్నాన్న. నన్ను ఎత్తుకొని పెంచిన వాడు. ఆనాడు ముందు చూపుతోనే నన్ను కడప ఎంపీ గా పోటీ చేయాలని అడిగాడు. నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అప్పుడు నాకు అర్ధం కాలేదు. వివేకా మాట విని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కాదు అన్నారు. వివేకా హత్య జరిగి 5 ఏళ్లు దాటింది. ఈనాటికీ హంతకులకు శిక్ష పడలేదు. చివరికి వివేకా బిడ్డ చంపింది అని ముద్ర వేశారు. న్యాయం కోసం సునీత ఎక్కని గడప లేదు. తిరగని కోర్టులు లేవు. ఒక పెద్ద మనిషి హత్య జరిగితే ఇంత వరకు న్యాయం జరగలేదు. సీఎం జగన్ కేసును పట్టించుకోవడం లేదు. సొంత చిన్నాన్న చనిపోతే సహాయం కూడా లేదు. స్వయంగా జగన్ హంతకులను కాపాడుతున్నాడు. ఈ 5 ఏళ్లు హంతకులను కాపాడి మళ్ళీ వాళ్ళకే సీట్ ఇచ్చారు. ఇది అన్యాయం, అధర్మం. హత్య చేసిన వాళ్ళకు సీట్ ఇవ్వడంతోనే నేను ఎంపీ గా పోటీ చేస్తున్నా. ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నా అని షర్మిల అన్నారు.
Raghurama Krishna Raju: రఘురామకు టిక్కెట్ కన్ఫర్మ్ .. ఎక్కడి నుండి అంటే..?