Raghurama Krishna Raju: వైసీపీకి రాజీనామా చేసిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై గత కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నరసాపురం లోక్ సభ స్థానం నుండి కూటమి అభ్యర్ధిగా ఆయన పోటీ చేస్తానని పలు మార్లు చెప్పారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా నర్సాపురం స్థానం బీజేపీకి వెళ్లడం, అక్కడ బీజేపీ నేతను అభ్యర్ధిగా ఎంపిక చేయడంతో రఘురామ పోటీపై సందిగ్ధత నెలకొంది.
రఘురామ కృష్ణరాజు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ అయితే కన్ఫర్మ్ అయ్యింది. చంద్రబాబు ఆయనకు టికెట్ ఖరారు చేశారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గాన్ని రఘురామకు చంద్రబాబు కేటాయించారు. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు రఘురామ కృష్ణరాజు. టీడీపీ కండువా కప్పుకున్నారు.
తొలుత ఎంపీగా పోటీ చేస్తారని భావించినా .. అని కన్ఫర్మ్ కాలేదు. టీడీపీ నుండి ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రఘురామ సిద్దమైయ్యారు. అయితే ఉండి నియోజకవర్గానికి తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరును పార్టీ ప్రకటించింది. తాజాగా సమీకరణల నేపథ్యంలో ఆ టిక్కెట్ ను రామరాజుకు కాదని, రఘురామకు టీడీపీ అధిష్టానం ప్రకటించింది.
అంతకు ముందు భీమవరంలో కూటమి నేతలతో రఘురామ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని వెల్లడించారు. రఘురామకు టీడీపీ నుండి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఆయన పోటీపై సస్పెన్స్ కు తెరపడింది.