National Press Day: ఒకసారి మనం కాలంలో వెనక్కి ప్రయాణించి 1780 కి వెళ్ళినట్లయితే ఇండియా లో ప్రసురించబడిన మొట్టమొదటి వార్తాపత్రిక ‘హికీస్ బెంగాల్ గెజిట్’ అప్పుడప్పుడే ఊపిరి పోసుకోవటం చోడోచ్చు. ఇది పూర్తిగా ఇంగ్లీష్ లో ప్రచురించబడిన వార్తాపత్రిక. ఆలా మొదలైన మన జాతీయ పత్రికా ప్రయాణం రానున్న కాలంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో అసమానమైన పాత్ర పోషించింది.
కట్ చేస్తే… భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత… నవంబర్ 16, 1966న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. దీని గౌరవార్ధం ప్రతి సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం(National Press Day) లేదా జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటాం.
నవంబర్ 16, 1966న స్థాపించినప్పటికీ , ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఆక్ట్ ధ్వారా 1978 లో ఈ సంస్ధని చట్టబద్దీకరించాం. దేశం లో జర్నలిస్టులు ఎలాంటి అనవసరమైన ప్రభావం లేదా బాహ్య కారకాలు ఒత్తిడికి లోబడకుండా స్వేచ్ఛతో నిజాయితీగా పనిచేసుకునే వాతావరణం కలిపించటమే ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. కానీ ఈ రోజు ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా లాంటి సంస్థలకు మన సమాజం లో చోటు లేదు.
మనమంతా బానిసలం
గానుగలం పీనుగలం
వెనుక దగ ముందు దగ
కుడి యెడమల దగ దగ
కాలం మారినా, రాకెట్ యుగం అయినా, పత్రికా మాధ్యమాలు సోషల్ మీడియా ఇంకా న్యూ మీడియా ధ్వారా కొత్త యుగం లో కథం తుక్కుతున్నా … వెనుక ఉన్న మనిషి బుద్ధి మారలేదు. డబ్బు, పలుకుబడి, స్వలాభం మనిషిని నడిపే ఇంధనాలు. మంచి వారు లేరు అని దీని అర్ధం కాదు, ఉంది ఎం ప్రయోజనం అనే నిస్పృహ.
మనది ఒక బతుకేనా ?
కుక్కల వలె , నక్కల వలె
మనదీ ఒక బతుకేనా ?
సందులలో పందుల వలె
వార్తలు అనే పదానికి అర్ధం మారిపోయింది. పత్రిక స్వేచ్ఛ అనేది ఒక భ్రమ. ప్రతీ రాజకీయ పార్టీ కి ఒక న్యూస్ ఛానల్, ఒక న్యూస్ పేపర్. ఇవి చాలక పోతే, సోషల్ మీడియా. ఇక్కడ నిజం తో పని లేదు, అవాస్తవం గుర్తించి ఆరా తీసే అవసరమూ లేదు. నీకు ఏది కావాలో అదే నీ నిజం.
ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా లాంటి సంస్థలకు చోటు లేదు, మొరగటానికి నోరు ఉన్నా వాడదు, కురవడానికి అసలు పళ్ళు లేవు.