Vijayasai Reddy’s Strong Remarks on TDP: టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో భవిష్యత్తు గ్యారంటీ పేరుతో సభలను నిర్వహిస్తూ వైసీపీ సర్కార్ పై విమర్శల దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నిర్వహిస్తున్న భవిష్యత్తు గ్యారంటీ సభలపైనా, ప్రతిపక్షాల తీరుపైనా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్మోహనరెడ్డి సర్కార్ లో రాష్ట్రంలో పస్ట్ తారీఖునే పెన్షన్లు చేతికి అందుతున్నాయి. రైతులకు, విద్యార్ధులకు, ఆరోగ్య శ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి, కార్మికులకు, చేతి వృత్తుల వారికి పథకాలు ఉన్నాయి. 32 లక్షల కుటుంబాలకు జగన్ గారు ఇళ్ల స్థలాలు కేటాయించారు. చీకూ చింతా లేని భవిష్యత్తు అంటే ఇదే కదా.. హాయిగా ఉన్న రాష్ట్ర ప్రజలకు టీడీపీ కొత్తగా ఇవ్వగలిగే భవిష్యత్తు గ్యారంటీ ఇంకేముంటుంది అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రంలో 175 కి 175 కాదు.. కనీసం 150 అసెంబ్లీ స్థానాల్లో సొంతంగా పోటీ చేసే సత్తా ప్రతిపక్ష పార్టీలకు లేదని పేర్కొన్న విజయసాయి రెడ్డి.. ఈ విషయంపై ప్రస్తావిస్తే ఒంటరిగానో, కలిసికట్టుగానో, ఏలా పోటీకి దిగాలో చెప్పాల్సిన అవసరమేంటని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారన్నారు. సింగిల్ గా బరిలోకి దిగి విజయం సాధించిన వారికే చరితర్లలో స్థానం దొరుకుతుందని అన్నారు విజయసాయిరెడ్డి.
గెలుపు ఆశలు సన్నగిల్లుతుంటే టీడీపీ నిస్పృహలోకి జారి పోతోందని విమర్శించారు. వ్యాపారుల మధ్య గొడవలను కూడా కూడా వైసీపీకి అంటగట్టే నీచపు ప్రయత్నాలు చేస్తొందని అన్నారు విజయసాయిరెడ్డి, ఇటీవల విజయవాడలో వస్త్ర వ్యాపారాలపై జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శిస్తూ ట్వీట్ చేయడంపై విజయసాయి రెడ్డి ఈ విధంగా స్పందిస్తూ.. ఎవరైనా కళ్లు తిరిగి కిందపడినా, జ్వరం వచ్చి పడుకున్నా దానికీ వైసీపీదే బాధ్యత అనే స్థాయికి చేరుకున్నారు నేతలు అంటూ ఎద్దేవా చేశారు. మీడియాలో ప్రచారం కోసం రోజుకో ఎత్తుగడ వేస్తున్నారన్నారు.