వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వ తీరుపై మరోసారి మండిపడ్డారు. న్యాయస్థానాలలో పిటిషన్ల పేరుతో ప్రజాధనాన్ని కోట్లకి కోట్లు జగన్ సర్కార్ దుర్వినియోగం చేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలలో తప్పులు ఉంటే ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కు ఉందని, ఆ విధంగా ప్రశ్నిస్తే దాన్ని తట్టుకోలేక పోవడం అక్కడ ప్రజల డబ్బు వృధా అవుతుంది అంటూ విమర్శించారు. విమర్శించే హక్కు స్వాతంత్రం లో భాగమని, అందరూ అనుకూలంగా మాట్లాడాలని అనుకోవడం ఏంటి అంటూ రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే వెంటాడి అరెస్టు చేస్తారా..?, ప్రభుత్వ విధానాల్లో లోపాలుంటే ఎత్తిచూపడం అది నా హక్కు, అలాంటప్పుడు నన్ను ఎందుకు మానసికంగా వేధిస్తున్నారు అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. చాలామంది సలహాదారులను పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…. తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానంలో ఎందుకు విగిపోతున్నాయి…. అని ప్రశ్నించారు.
ముఖ్యంగా తనని రాజీనామా చేయాలని వైసీపీ నేతలు కామెంట్లు చేయటంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నన్ను రాజీనామా చేయడానికి వారెవరు, నేను రాజీనామా చేసిన మూడు రెట్ల మెజారిటీతో గెలుస్తాను అని పేర్కొన్నారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మొత్తం మీద వైసీపీ ని విమర్శిస్తూ ఏదో రకంగా టార్గెట్ చేసే రఘురామకృష్ణంరాజు…. న్యాయస్థానాల్లో పిటీషన్లు ఈ విషయంలో ప్రజాధనం వృధా అవుతుందని బిగ్ అండ్ సాలిడ్ కంప్లైంట్ చేయడం ఏపీ రాజకీయాల్లో హైలెట్ గా మారింది.