త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎవరికి వారు ప్రజలకు వరాలు జల్లు కల్పించేలా మ్యానిఫెస్టోలు తయారుచేసుకునే ఆలోచనలు కూడా స్టార్ట్ చేశారు. మరోపక్క రజినీకాంత్ అదేవిధంగా కమలహాసన్ కూడా పోటీ చేయబోతున్న తరుణంలో… తమిళ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా తమిళనాడు రాజకీయాల్లో బిజెపి ఈసారి రాణించాలని సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసినట్లు టాక్.
పూర్తి విషయంలోకి వెళితే రాజకీయాల్లో గాని సినిమా రంగ పరంగా గానీ తమిళులు ఒక వ్యక్తిని నమ్మితే అభిమానిస్తే… బీభత్సమైన, అభిమానాన్ని చూపిస్తారు. ఏకంగా గుడులు కూడా కట్టేస్తారు. కొంత మంది సినిమా హీరోలు అదేవిధంగా చనిపోయిన జయలలిత కి కూడా ఈ విధంగానే తమిళులు గుళ్ళు కట్టడం జరిగింది. ఇటువంటి తరుణంలో తమిళుల అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి బీజేపీ అధిష్టానం… సీనియర్ హీరోయిన్ కుష్బూ ని రంగంలోకి దింపనున్నట్లు టాక్ వస్తోంది.
ఇటీవల సీనియర్ హీరోయిన్ కుష్బూ కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తమిళ అభిమానాన్ని సంపాదించుకున్న ఖుష్బూకి… పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించడానికి బీజేపీ అధిష్టానం రెడీ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. తమిళ రాజకీయాలు గమనిస్తే డీఎంకే పైన ప్రజలలో అభిప్రాయాలు ఉన్నాయి. అదేవిధంగా అన్నాడీఎంకే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అసలు పట్టించుకునే నాధుడే లేడు అన్నట్టు ఉంది. ఇలాంటి తరుణంలో ఖుష్బూ కి అన్ని విధాల సహకారం అందించి, ఆమెనే సీఎం అభ్యర్థిగా ప్రకటించి తమిళ రాజకీయాల్లో బిజెపి జండా ఎగిరేలా కాషాయ దళం రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.