CBI Court: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి సంబంధించి అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ అర్హతపై ఇటీవల సీబీఐ కోర్టు.. పిటిషన్ తరపున వాదనలు విన్నది. పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు నేడు కోర్టు వెల్లడించింది.
తమ నాయకుడు, సీఎం వైఎస్ జగన్ పై తనకు గౌరవం ఉందని రఘురామ కృష్ణం రాజు జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే 11 కేసుల చార్జిషీటులో ఏ 1 గా ఉన్నందున విచారణను ఎదుర్కొని నిర్ధోషిగా బయటకు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. తన పిటిషన్ ను ఏసిబీ కోర్టు విచారణకు స్వీకరించిందన్న పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు తదుపరి కోర్టు సీబీఐకి,. జగన్ కు నోటీసులు జారీ చేస్తుందన్నారు. తన పై అనవసరంగా నోరు పారేసుకోవద్దంటూ వైసీపీ శ్రేణులకు ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడం ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.