కర్నూలు, జనవరి 8: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం కోస్గి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
జలధార ధార పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తాం. జిల్లాలో 97 ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తాం. కర్నూలు ఎయిర్పోర్టు నుండి అమరావతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాదుకు విమాన సర్వీసులు ఉంటాయి అని సిఎం చెప్పారు.
త్వరలో ఓర్వకల్లు ఇండ్రస్టీ హబ్గా మారుతుంది. 200 ప్రముఖ కంపెనీలు రానున్నాయి అని అన్నారు.
పని చేసే ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని చంద్రబాబు కోరారు.