హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా హుష్ కాకి అయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరగా తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.
గండ్ర వెంకట రమణారెడ్డి ఆయన సతీమణి జ్యోతిలు సోమవారం టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గండ్ర సతీమణి జ్యోతి పేర్కొన్నారు.