ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ పాఠ్యాంశ పుస్తకాలలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర నీ పాఠ్యాంశంగా చేర్చడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి నందమూరి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా తెలుసుకోవలసిన విషయాన్ని చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం పట్ల నందమూరి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దానిలో కుటుంబ సభ్యులందరి తరపున కేసిఆర్ కి కృతజ్ఞతలు అని అన్నారు.
మా తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర గురించి రాబోయే తరాల వారికి తెలియజేసే ఉద్దేశంతో పాఠ్యాంశాంగా చేర్చడం గొప్ప విషయమని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరి కి మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు మరియు తెలుగువారు కూడా గర్వపడుతున్నారు. ఇదే రీతిలో ప్రెస్ నోట్ లో ఎన్టీఆర్ గారి లో ఉన్న నీతి, నిజాయితీ, పట్టుదల, నిబద్ధత ఇవన్నీ రాబోయే తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది.
కచ్చితంగా ఈ పాఠ్యాంశం వల్ల రాబోయే తరం వాళ్ళు ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తారు అంటూ నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు. అయితే ఈ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో కూడా రిలీజ్ కావడంతో…. కేసిఆర్ ప్రత్యర్థి అయిన గాని ఆయన్ని పొగడ్తలతో నందమూరి కుటుంబ సభ్యులు పొగడటం అది నందమూరి ఫ్యామిలీ గొప్పదనం అని కామెంట్లు పెడుతున్నారు. రాజకీయంగా భావజాలాలు వేరైన నందమూరి కుటుంబానికి మూలస్తంభం దివంగత ఎన్టీఆర్ కి కేసిఆర్ కూడా మంచి ప్రముఖ స్థానం ఇవ్వటం నిజంగా అభినందించాల్సిన విషయమే అని నెటిజన్లు అంటున్నారు.