ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ సినీ యాక్టర్ విద్యావేత్త రాజకీయ నాయకుడు మోహన్ బాబు కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం తెలిసిందే. బాబు పేరు వింటేనే… మోహన్ బాబు ఎగిరెగిరి పడతారు. మరి వారి ఇద్దరి మధ్య వైరం ఎలా వచ్చింది? ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారు ఇప్పుడు ఎందుకు చిటపటలాడుతూ ఉన్నారు?
అదే మొదలు….
మోహన్ బాబు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పరమ భక్తుడు. బాబు ఆయన మామ గారి నుండి పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్న తర్వాత మోహన్ బాబు.. చంద్ర బాబు నాయుడు తోనే కలిసి ఉన్నారు. ఇక్కడ రూమర్ ఏమిటంటే.. ప్రస్తుతం బాబు నడిపిస్తున్న ‘హెరిటేజ్‘ కంపెనీ లో అంతకుముందు మోహన్ బాబు కి షేర్లు ఉండేవట. అయితే వ్యాపారం విషయంలో వీరిద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో…. చంద్రబాబు తన రాజకీయ బలం ఉపయోగించి మోహన్ బాబుకి చెందిన షేర్స్ అమ్మేశారని చెబుతున్నారు. ఇక తనకు జరిగిన అన్యాయానికి ప్రతిగా మోహన్ బాబు నాయుడు పై పగ పెంచుకున్నారట.
పగ సాధించారు…
ఇకపోతే 2019 ఎన్నికల ముందు మోహన్ బాబు…. చంద్రబాబు నాయుడు ని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. తన విద్యానికేతన్ విద్యా సంస్థలకు చంద్రబాబు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కావాలని చెల్లించకుండా ఆపివేశారని రోడ్డెక్కారు. అంతేకాకుండా జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపి వారికి అనఫీషియల్ ప్రచారకర్తగా కూడా వ్యవహరించారు. చివరికి చంద్రబాబు ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంటే తప్పించి మోహన్ బాబు శాంతించలేదు.
ఇంకేం ఆపుతోంది?
ప్రస్తుతం వినాయక చవితి సందర్భంగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాబు మోసగాడని మోహన్ బాబు చెప్పడం గమనార్హం. అయితే నేరుగా చంద్రబాబు పేరు ని వాడకుండా తను గతంలో ఒక వ్యక్తిని నమ్మితే అతను మోసం చేశాడని.. తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యాడని.. తాను అతని వల్ల ఆర్థికంగా నష్టపోయానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో అసలు మోహన్ బాబు…. చంద్రబాబు పేరును నేరుగా చెప్పడానికి అతనిని ఏమి ఆపుతోందో అర్థం కావడం లేదని అందరూ తల గోక్కుంటున్నారు. మరి మీకు ఏమైనా అర్థం అయిందా…?