డిల్లీ, ఫిబ్రవరి 8: ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన విద్యార్థులు, వ్యక్తులపై కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు స్వాగతించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుక్రవారం కెవిపి బహిరంగ లేఖ రాశారు.
చంద్రబాబుకు ఇప్పటికైనా హోదా గుర్తుకు వచ్చిందని అన్నారు.
కేంద్రానికి బాబు డూడూ బసవన్నలా తలూపాడని విమర్శించారు.
ఐదేళ్లకు ఒక సారి ఎన్నికలకు పోవాలన్న నిబంధన పెట్టినందుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ధన్యవాదాలు చెపుతున్నానని కెవిపి పేర్కొన్నారు.
లేకుంటే తన వెర్రి నిర్ణయాలతో ప్రజలను టార్చర్ పెట్టిన మోది, ఊసరవెల్లి సైతం నివ్వెరబోయేలా మాటలు మార్చిన చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చే వారే కాదని లేఖలో పేర్కొన్నారు.
ఎపికి కేంద్రం న్యాయం చేయాలని కాంగ్రెస్ పోరాడుతుంటే, కేంద్రానికి టిడిపి ప్రభుత్వం డూడు బసవన్నలా తల ఊపిందని కెవిపి రామచంద్రరావు విమర్శించారు.