అమరావతి: బెంజ్ సర్కిల్ వంతెన సమస్య చాలా చిన్నది. ఇంత చిన్న సమస్యకు పరిష్కారం చూపలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పెద్ద సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారంటూ టిడిపి ఎంపి కేశినేని నాని ప్రశ్నించారు. ‘మీకు చేతకాకపోతే చెప్పండి, నేను చేసి చూపిస్తా, మీరు నిమ్మగడ్డ వ్యవహారం చూసుకోవచ్చు’ అంటూ కేశినేని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా ఎంపి కేశినేనిపై వైసిపి పారిశ్రామికవేత్త పోట్లూరి వరప్రసాద్ (పివిపి) గురజాడ కవితతో వ్యంగంగా విమర్శించారు.
‘ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయి సొంత లాభం కొంత మానుకుని పొరుగు వానికి తోడుపడవోయ్ దేశమంటే తెలుగుదేశం కాదోయ్ నువ్వు జీతాలు ఎగొట్టిన కార్మికులు కూడా మనుషులోయ్ కాస్త వారి కష్టాలు చూడవోయ్ !!’ అంటూ వ్యంగంగా పివిపి ట్వీట్ చేశారు.