అమరావతి, జనవరి 19: రాజధాని రైతుల భూములను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పారు.
ప్రచారంలో ఆర్భాటం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని ఆయన అన్నారు. ఎన్నికల కోసమే కొన్ని తాయిలాలను ప్రకటిస్తున్నారని ఆయన చెప్పారు. మోదీకి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసేందుకే తెలంగాణ సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బిజెపిని ఓడించేందుకు అన్ని పార్టీలు కలసి రావాలని ఆయన కోరారు.
previous post
next post