Pawan Kalyan : తిరుపతి ఉప ఎన్నికలు ఏప్రిల్ 17వ తారీఖున జరగనున్న సంగతి తెలిసిందే. జరగనున్న ఉప ఎన్నికలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో వచ్చిన ఈ ఎన్నికల్లో… వైసిపి పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పోటీ చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, బిజెపి పార్టీ తరఫున రత్నప్రభ పోటీకి దిగుతున్నారు. ఇటువంటి తరుణంలో బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా రత్నప్రభ విజయం కోసం.. బిజెపి పార్టీకి చెందిన నేతలు తీవ్ర స్థాయిలో కష్టపడుతూ ఉన్నారు.
ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరియు కొంతమంది కీలక నాయకులు ఎన్నికల ప్రచారంలో..బిజీ బిజీగా గడుపుతున్న ఉండగా మరో పక్క తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా.. తిరుపతి ఉప ఎన్నికలలో.. పార్టీ తరపున ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రత్నప్రభ విజయం కోసం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది అంట. మేటర్ లోకి ఏప్రిల్ మూడోతారీకు తిరుపతిలో పాదయాత్ర చేయటానికి పవన్ రెడీ అయినట్లు.. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఎంఆర్ పల్లి కూడలి నుండి శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ పాదయాత్ర చేయనున్నారట. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర కోసం కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు బిజెపి పార్టీకి చెందిన కీలక నేతలు. కచ్చితంగా ఈ ఎన్నికలలో విజయం సాధించాలని చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకోవటం జరిగింది. కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అధికార పార్టీ వైసీపీ ఈ ఎన్నికలలో భారీ స్థాయిలో మెజార్టీ సాధించి… ఏపీలో వైసీపీ కి తిరుగు లేదు అని నిరూపించడానికి రెడీ అవుతుంది.