Congress: కాంగ్రెస్ Congress ఘన చరిత్ర ఉన్న పార్టీ పరిస్థితి ప్రస్తుతం చూస్తే ఆశ్చర్యం ఓవైపు.. జాలి మరోవైపు కలుగుతాయని చెప్పాలి. వందేళ్లకు పైగా ప్రస్థానం ఉన్న పార్టీ ప్రస్తుతం తన అడుగులు చాలా భారంగా వేస్తోంది. రీసెంట్ పుదుచ్చేరిలో పరిస్థితి మరో ఉదాహరణ. అధికారంలో ఉన్న చోట్ల కూడా పార్టీ నాయకుల్ని కాపాడుకోలేని స్థితి. ఏళ్లుగా రాష్ట్రాల్లో ఏకచత్రాధిపత్యం చెలాయించిన ఆ పార్టీకి ఇప్పుడు పూర్వ వైభవం సాధించాల్సిన పరిస్థితి ఎంతో అవసరం. ప్రస్తుతం ఆ బాధ్యతను తమ భుజాలపై వేసుకుని మోస్తున్నారు ప్రియాంక, రాహుల్.
విజయం కోసమో.. ఉనికి కాపాడుకునేందుకో గానీ.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ తాపత్రయపడుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ తమిళనాడు, కేరళలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. స్థానిక యువతతో చెరువులోకి దూకి ఈత కొట్టడం, చిన్నారులతో కలిసి భోజనం చేయడం చేసారు. తమిళనాడులో ఒక విద్యార్ధినితో పోటీ పడి పుషప్స్ తీయడం కూడా జరిగింది. బాలిక నెమ్మదిగా పుషప్స్ తీస్తే.. రాహుల్ చాలా వేగంగా తీశారు. ఆయాసం కూడా ఆయనలో కనపడలేదు. వెంటనే సింగిల్ హ్యాండ్ తో కూడా పుషప్ తీసి చిరునవ్వు నవ్వారు.
ఇక ప్రియాంక గాంధీ కూడా పర్యటనలో తన మార్కు చూపిస్తున్నారు. అసోం టీ తోటల్లో స్థానిక మహిళలతో కలసి తేయాకు తోటల్లో పని చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేవి కాకపోయినా.. కాంగ్రెస్ పార్ట ఉనికిని చాటుకునేవి అని మాత్రం చెప్పాల్సిందే. రాష్ట్రాల్లో సొంతంగా మెజార్టీ రావడం లేదు. పొత్తులతో అధికారం చేపట్టినా నిలవడం లేదు. ఇదంతా కాంగ్రెస్ ఉన్న పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంతో ప్రియాంక, రాహుల్ చేస్తున్న ఒంటరి పోరాటం కాంగ్రెస్ కు సమీప భవిష్యత్తులో మళ్లీ మంచి రోజులు దక్కేందుకు ఉపయోగపడాయని చెప్పాలి.
రోజురోజుకీ బీజేపీ పాలనపై ప్రజల్లో కొత్త అనునమానాలు రేకెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, ఢిల్లో రైతుల ధర్నాలు.. ఇవన్నీ బీజేపీపై కొత్త ఆలోచనలకు కారణమవుతున్నాయి. గ్యాస్ ధర మళ్లీ 25 రూపాయలు పెరగడం ఇందుకు ఓ నిదర్శనం. పెట్రోల్ రేట్లపై చేతులెత్తేసిన కేంద్రానికి వ్యతిరేకంగా పాల రేట్లు పెంచేస్తున్నారు. ఇవన్నీ.. ఇప్పటికిప్పుడు బీజేకి నష్టం.. కాంగ్రెస్ కు లాభం చేయవు. కానీ.. ప్రియాంక, రాహుల్ చేస్తున్న పర్యటనలు ఈ మూడేళ్లలో కాంగ్రెస్ గురించి ప్రజలు ఆలోచించేందుకు మాత్రం ఊతమిస్తాయని చెప్పాలి. ఏమో.. గుర్రం ఎగురావచ్చు..!!