అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వి.విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు.
వివేకా హత్యకు గురైనప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని 420 తాతయ్య విజయసాయిరెడ్డి అంటే అర్థం చేసుకోలేకపోయామని బుద్దా వ్యాఖ్యానించారు.
దొంగ లెక్కలే కాదు, మర్డర్ డైరెక్షన్లో కూడా ఆరితేరిపోయారని అర్థమైందని బుద్దా విమర్శించారు. ‘ఆ హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య వెనకాల మర్మమేంటో చెప్తావా తాతయ్యా, ఇంతకీ బాబాయ్ను ఎవరు హత్య చేశారు’ అంటూ బుద్దా ప్రశ్నించారు.
వివేకాగారు హత్యకి గురైనప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని 420 తాతయ్య @VSReddy_MP గారు అంటే అర్థం చేసుకోలేకపోయాం. మీరు దొంగ లెక్కలే కాదు మర్డర్ డైరెక్షన్ లో కూడా ఆరితేరిపోయారని అర్ధమైంది. ఆ హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య వెనకాల మర్మమేంటో చెప్తావా తాతయ్యా? ఇంతకీ #WhoKilledBabai ?
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) September 3, 2019