కరోనా లాంటి క్లిష్ట సమయంలో తెలంగాణలో అధికార పార్టీ నాయకులంతా ఇంటికే పరిమితమైతే ఆమె మాత్రం నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడింది. ఆమె మరెవరో కాదు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్క. ఏజెన్సీ ఏరియాకు చెందిన ఈ నియోజకవర్గంలో గతంలో టిఆర్ఎస్ పార్టీకి చెందినా అజ్మీర చందూలాల్ కి మంచి పట్టు ఉండేది. కానీ ఎప్పుడైతే సీతక్క నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చిందో సీన్ మొత్తం మారిపోయింది.
ఉద్యమ నాయకురాలు, మాజీ నక్సలైట్ గా రాణించిన సీతక్క 2018 ఎన్నికలలో గెలిచి కేసీఆర్ పార్టీకి షాకిచ్చింది. సీతక్క వెనుక రేవంత్ రెడ్డి అండగా ఉండటంతో….. ములుగు నియోజకవర్గం లో దూసుకుపోయింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో సీతక్క ని ఎదుర్కోవడానికి మండల అధికారి నాయకులను పావులుగా వాడుకొని అధికార పార్టీ నేతలు అనేక ఇబ్బందులు పెడుతున్నారట. ప్రజలలో బలమైన లీడర్ గా సీతక్క ఎదగడం అధికార తెరాస పార్టీ కి నచ్చడం లేదని తెలంగాణ పాలిటిక్స్ లో టాక్.
కరోనా సమయంలో అదేవిధంగా ఇటీవల వరంగల్ లో వచ్చిన వరదలు టైంలో ప్రజలకి అండగా ఉంటూ వారి తోనే భోజనం చేస్తూ ధైర్యం చెప్పింది. ప్రజలకి అనేక రీతులుగా కష్ట కాలంలో వసతులు కల్పిస్తూ చేస్తున్న రాజకీయాలకు కేసీఆర్ తో పాటు టోటల్ టిఆర్ఎస్ పార్టీ ఉలికి పడుతోంది అని తెలంగాణ రాజకీయాల్లో టాక్ నడుస్తుంది. కరోనా లాంటి కష్ట సమయంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా తమ తమ నియోజకవర్గాలలో అండగా ఉన్న దాఖలాలు ఎక్కడ కనపడలేదు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సీతక్క…. తన నియోజకవర్గంలో చేసిన పనులు మీడియాలో ఎంతోమందిని ఆకర్షించాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఉన్న కొద్దీ సీతక్క పొలిటికల్ గ్రాఫ్ పెరుగుతున్న తరుణంలో …. టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో భయం నెలకొన్నట్లు టాక్ వినపడుతోంది.