అమరావతి, మార్చి 19: తెలుగుదేశం పార్టీ స్టార్ కాంపైనర్గా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రచార బాధ్యతలను రాధాకృష్ణకు అప్పగించారు.
మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుండి గానీ ఏ ఇతర నియోజకవర్గం నుండి పోటీ చేయాలన్నా రాధాకు అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినా తనకు పదవులు ముఖ్యం కాదని రాధా తెలియజేశారు.
ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడమే తన ధ్యేయం అని పేర్కొన్న వంగవీటి రాధాకృష్ణ టిడిపి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడైన వంగవీటి రాధాకృష్ణ అయిదు రోజుల క్రితం తన వర్గీయులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.