అమరావతి: టిడిపి గేమ్ ప్లాన్ లో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్..వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆపార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ చేతిలో పవన్ కల్యాణ్ ఓ కీలుబొమ్మలా మారిపోయారని విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. ‘టిడిపి ప్రభుత్వం హయాంలో పవన్ కల్యాణ్ నిశ్శబ్ధంగా ఉన్నారు. టిడిపి గేమ్ ప్లాన్ లో భాగంగా.. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్నారు. ఇది బహిరంగ రహస్యం. చంద్రబాబు చేతిలోని కీలుబొమ్మలా పవన్ వ్యవహరిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
@PawanKalyan always maintained a stoic silence on the misdeeds of the TDP Govt. He is now targeting the YSRCP Govt as a part of a game-plan with the @JaiTDP. It is an open secret that he has always been hand in glove with @ncbn. @JanaSenaParty
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2019
సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వసూలయ్యే పన్నును ఆదా చేసేలా సాగుతున్నాయని విజయసాయి అన్నారు. పారదర్శకతపై దేశానికే ఆదర్శంగా నిలిచి, ఓ దిశను చూపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో చౌకబారు ప్రచారం కోసం కాకుండా పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు ఏదైనా విమర్శలు చేసేటప్పుడు ముందూ, వెనుకా ఆలోచించాలని సూచించారు. ఈ మేరకు విజయసాయి మరో ట్విట్ చేశారు.
The bold decisions of our Hon’ble CM would save the taxpayers money and show a new direction to the country in terms of transparency. Instead of indulging in ”cheap publicity”, people like @PawanKalyan should be objective in their criticism. @AndhraPradeshCM
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2019