YS Jagan: సినిమా టికెట్ ధర విషయంలో ట్విట్టర్ వేదికగా వైసీపీ మంత్రి పేర్ని నాని(Perni Nani) వర్సెస్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ రేట్స్ ప్రభుత్వం తగ్గించడం పట్ల… ఏపీ ప్రభుత్వంపై మండిపడుతూ.. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఢీ అంటే ఢీ అనే రీతిలో.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అమ్మేవాడికి.. కొన్నేవాడికి లేని బాధ మధ్యలో ప్రభుత్వానికి దేనికి అంటూ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్ చేయటం తెలిసిందే.
ఓపెన్ గానే టికెట్లు అమ్ముతుంటే దానిపై ప్రభుత్వ పెత్తనం ఏమిటి అని ప్రశ్నించారు కూడా. పేదల కోసం ప్రభుత్వం పని చేస్తుందని చెప్పడంలో తప్పులేదు, కానీ పేదలను ధనికులగా చేయాలి. కానీ ఉన్న ధనికులు పేదలు లాగా చేయకూడదు అంటూ.. వ్యగ్యంగా రియాక్ట్ అయ్యారు. అంతమాత్రమే కాక.. మంత్రి పేర్ని నాని అనుమతిస్తే ప్రభుత్వంలో ఉన్న టాప్ ఎకనామిక్స్ నిపుణులతో టీవీ డిబేట్ కి తాను రెడీ అని.. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ.. మిస్ అండర్స్టాండింగ్ తొలగిపోతుందని ఇది చాలా అవసరమని చెప్పుకొచ్చారు.
ఈ తరుణంలో మంత్రి పేర్ని నాని… తప్పకుండా ఆర్జీవికి త్వరలోనే కలుద్దామని సమాధానమిచ్చారు. వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడంతో ఆర్జివి- పేర్ని నాని ట్విట్టర్ గొడవ.. సీఎం వైఎస్ జగన్(YS Jagan) దాకా వెళ్లినట్లు.. వీళ్ళిద్దరికీ సరిగ్గా సరిపోతుంది అని తన సన్నిహితుల వద్ద ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అన్నట్టు టాక్ నడుస్తోంది. చాలా వరకు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం(Ap Governament) పై ఎక్కువగా సినిమా టికెట్ల వ్యవహారం విషయంలో.. విమర్శలు వస్తూ ఉండటంతో జగన్.. ఆర్జివి -పేర్ని నాని ట్విట్టర్ వార్ పట్ల ఈ రీతిగా రియక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.