ప్రస్తుత మానవ జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయింది. దాదాపు మనిషి జీవితంలో ఇంటర్నెట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ ఇంటర్నెట్ ద్వారానే ఎక్కువ జీవితాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు రావడంతో.. మనిషి జీవితాన్ని ఇంటర్నెట్ చాలా ప్రభావితం చేస్తూ ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏది జరిగిన సెకండ్లలో తెలిసిపోతుంది. సమాచార వ్యవస్థ స్మార్ట్ ఫోన్ వచ్చాక మరింత స్పీడ్ అందుకుంది.
What’s App: మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకోస్తున్న వాట్సాప్..!!
ఇదే సమయంలో టెక్నాలజీ పరంగా మంచి ఎంత జరుగుతుందో అదే రీతిలో చెడు కూడా జరుగుతూ ఉంది. దీంతో టెక్నాలజీ తెలియని చాలామంది వివిధ రూపాలలో మోసపోతున్నారు. ఈ రకంగానే వాట్సాప్ ద్వార మోసపోతున్నట్లు సరికొత్త వార్త బయటపడింది. మేటర్ లోకి వెళ్తే సామాన్యులు, స్టూడెంట్ లు ఇంకా ఉద్యోగస్తులు .. చాలావరకు వాట్సప్ వాడుతూ ఉన్నారు. ఈ వాట్సప్ ద్వారా సందేశాలు పంపించడం మాత్రమే కాకుండా వీడియో కాల్స్, మామూలు కాల్స్ తో పాటు లావాదేవీలు కూడా జరుగుతూ ఉన్నాయి.
అయితే ఈ వాట్సాప్ లో పేరుతో ఇటీవల “హే వాట్సాప్” యాప్ రావటం జరిగింది. అయితే ఈ నకిలీ వాట్సాప్..తో యూజర్లు జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సీఈవో విల్ కాత్ కార్ట్ హెచ్చరించడం జరిగింది. వాట్సాప్ పేరుతో వస్తున్న ఈ “హే వాట్సాప్” వాడేవారు తప్పకుండా ఇబ్బందులు పడతారని హెచ్చరించరు. వాట్సాప్ లో లేని కొన్ని ఫీచర్లు అందులో ఉన్నాయని, దానికి ఎండ్ టూ ఎండ్ ఏన్ క్రిప్షన్ ఉండదన్నారు. “హే వాట్సాప్” వాడే యూజర్ల వ్యక్తిగత సమాచారం అపహరణకు గురవుతుందని వాట్సాప్ సీఈవో హెచ్చరించారు.