ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ వినియోగదాల్లో ఎక్కువ శాతం మంది వాట్సాప్ ఆన్ లైన్ మెసేజ్ యాప్ వాడుతున్న విషయం తెలిసిందే. చిన్నా, పెద్ద, మహిళలు, పురుషులు అన్న భేదం లేకుండా ఆండ్రాయిడ్ సెల్ వినియోగదారులు అందరూ ప్రస్తుతం వాట్సాప్ ద్వారానే అన్ని సంభాషణలు చేస్తున్నారు. రోజులో వందల సార్లు వాట్సాప్ చేసుకుంటూనే ఉంటున్నారు. మనిషి జీవితంలో వాట్సప్ అనేది ఒక భాగంగా అయిపోయింది.
ఈ నేపథ్యంలో వాట్సాప్..తమ వినియోగదారులకు ఎప్పటి కప్పుడు ఆకర్షించేందుకు సరికొత్త ఫీచర్లు తెర మీదికి తీసుకునివస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక అద్భుతమైన ఫీచర్లను వాట్సాప్ వినియోగదారులకు అందించింది.
ఇప్పుడు తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారుల కోసం సిద్ధం చేసింది. అదేమిటంటే వాట్సప్ పేమెంట్స్ ఆప్షన్. ఈ పేమెంట్స్ ఆప్షన్ ద్వారా వాట్సాప్ నుంచి మెసేజ్ లు చేసుకోవడమే కాకుండా మనీ సెండింగ్, రిసీవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గత కొన్ని నెలల నుంచి ఈ పేమెంట్స్ ఆప్షన్ పై ట్రైల్స్ రన్ చేసిన వాట్సప్ చివరకు… పేమెంట్స్ ఆప్షన్ ను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఈ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ను వాట్సప్ అతి పెద్ద మార్కెట్ అయిన బ్రెజిల్ లో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. మరి కొద్ది రోజుల్లో ఇతర దేశాలకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ సదుపాయాన్ని వాట్సాప్ వినియోగదారులు అందరూ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అయితే బిజినెస్ సర్వీస్ కు మాత్రం 3.99 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆరు అంకెల పిన్ లేదా… ఫింగర్ ప్రింట్ ఫీచర్ ద్వారా నగదు లావాదేవీలను చేయడానికి కూడా ఈ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ లో అవకాశం ఉంటుంది. మాస్టర్ కార్డ్, డెబిట్ కార్డులకు కూడా ఈ పేమెంట్స్ ఆప్షన్ సపోర్ట్ చేస్తుంది. ఈ పేమెంట్స్ ఫీచర్ వల్ల వాట్సాప్ కి వినియోగదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం సెల్ వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే, భీమ్, అల్ట్రా క్యాష్, పేటియం తదితర యాప్ ల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించు కుంటున్నారు.