GHMC: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని బీజేపీ, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా మద్దతుగా టీఆర్ఎస్ నగర వ్యాప్తంగా భారీ గా ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్స్ ఎర్పాటు చేశారు. అయితే అనుమతి లేకుండా హోర్డింగ్ లు ఏర్పాటు చేసినందుకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. వీటిపై శనివారం వరకూ బీజేపీ నేతలకు రూ.,20లక్షలు, టీఆర్ఎస్ నాయకులకు రూ.3 లక్షలు జరిమానా విధించినట్లు జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఈవీడీఎం) డైరెక్టరేట్ అధికారులు తెలిపారు.
మరో పక్క మైట్రో రైలు స్తంబాలపై రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, చైతన్య పురి ప్రాంతంలో ఆయా ఫ్లెక్సీ లపై సికింద్రాబాద్ లో నేడు జరిగే విజయ సంకల్ప సభ ఫ్లెక్సీలను బీజేపీ నేతలు అంటించారు.