KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీం ను కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులకు కరోనా సోకగా… ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి మంత్రుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా తాజాగా కొప్పుల ఈశ్వర్ కు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు.
మంత్రి కీలక సూచన
తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిందని.. నియమ నిబంధనలను పాటిస్తూ స్వీయ నిర్భందంలోకి వెళ్ళానని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా సీఎం కేసీఆర్ కేబినెట్ సహచరులు సైతం కరోనా బారిన పడుతుండటం పలువురు కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోంది.
కరోనా డేంజర్ బెల్స్
ఇదిలాఉండగా, తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,976 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,97,361 కి చేరింది. కరోనా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో 7646 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో 4,28,865 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 65,757 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 35 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2739కి చేరింది.