NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: కేసిఆర్ సర్కార్ పై ప్రధాని మోడీ సంచలన కామెంట్స్

PM Modi: తెలంగాణ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీ బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని మోడీ పాల్గొని.. సమ్మక్క – సారలక్కకు జై అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. మీ ఆశీర్వాదంతోనవే తాను ప్రధానిని అయ్యానన్నారు. మీ ఆశీర్వాదంతోనే బీజేపీ బీసీ వ్యక్తి తెలంగాణ సీఎం అవుతారని అన్నారు. అన్నివర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. కేసిఆర్ కు రాష్ట్ర ప్రజల కంటే తన కుటుంబ ప్రయోజనమే ముఖ్యమని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందనీ, నీళ్లు, నిధులు, నియామకాలపై బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందన్నారు . బీసీల ఆకాంక్షలను ఎప్పుడూ బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలను మోసం చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీపైనే విశ్వాసంతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో మార్పు మొదలైందని, ఆ మార్పు తుఫాను ఈ మైదానంలోనే కనిపిస్తుందన్నారు. ఈ సభకు వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలను చూస్తుంటే కుటుంబ సభ్యుల మధయ్ ఉన్నట్లు అనిపిస్తొందన్నారు. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం భారతదేశ చరిత్రలో కొత్త ప్రయోగమని అభిప్రాయపడ్డారు.  బీఆర్ఎస్ ఓటమి ఖాయమని డంకా భజాయించి చెబుతున్నానన్నారు.

తొమ్మిది సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారన్నారు. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది బీజేపీయేనన్నారు. అబ్దుల్ కలామ్ ను వాజ్ పేయి రాష్ట్రపతిని చేశారనీ, పీఎ సంగ్మా, బాలయోగిని స్వీకర్ చేసింది. రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేసింది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసింది బీజేపీయేనని గుర్తు చేశారు. ఓబీసీ అయిన తనను ప్రధాని చేసింది బీజేపీయేనన్నారు. ఓబీసీ కేంద్ర మంత్రులు ఎక్కువగా ఉన్నది ఎన్డీఏ సర్కార్ లోనేనని చెప్పారు. ఓబీసీలకు ఎంపిలుగా ఎక్కువ అవకాశమిచ్చింది కూడా బీజేపీయేనన్నారు. కేసిఆర్ నేరవేర్చని హామీలను గుర్తు చేస్తూ తమ ప్రభుత్వం వివిధ వర్గాల అభ్యున్నతికి చేస్తున్న కృషి వివరించారు. అవినీతి సర్కార్ ను ఇంటికి పంపడం ఖాయమన్నారు.

ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, అందరూ శిక్షార్హులే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారిని కఛ్చితంగా జైలులో వేస్తామని అన్నారు. అయిదు తరాల భవిష్యత్తును కాంగ్రెస్ నాశనం చేస్తే .. రెండు తరాల భవిష్యత్తును బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేదలకు అయిదేళ్లు ఉచితంగా బియ్యం అందిస్తామని చెప్పారు. పేదలకు ఉచిత రేషన్ .. ఇది మోడీ ఇస్తున్న గ్యారెంటీ అని ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దోషులను వదిలిపెట్టామని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మోడీ స్పందిస్తూ.. అవినీతికి పాల్పడ్డ ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు.

CM YS Jagan: చంద్రబాబు హయాంలో అన్నీ స్కామ్‌లేనని మరో సారి దయ్యబట్టిన సీఎం జగన్

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju