CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు అకర్షించి ఇక్కడ కంపెనీలు తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ (స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుండి విమానంలో నేరుగా ఆయన దావోస్ కు పయనమైయ్యారు.
నేటి నుండి 19వ తేదీ వరకూ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలో అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రపంచ ఆర్ధిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికార బృందానికి సీఎం రేవంత్ నేతృత్వం వహించడం ఇది తొలి సారి.
నాలుగు రోజుల పర్యటనలో సుమారు 70 మంది పారిశ్రామిక వేత్తలతో బృందం చర్చించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులపై ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉన్నారు. దావోస్ పర్యటన ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లండన్ వెళ్లనున్నారు.
Gannavaram: పొగమంచు ఎఫెక్ట్ .. గన్నవరం విమానాశ్రయంలో ..