Guppedantha manasu :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 570 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ ఆయింది. ఇక ఈరోజు అక్టోబర్ 03 న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్లో వసుకి రిషిల మధ్య మరో రచ్చ చెలరేగింది.జాబ్ విషయంలో వసు అబద్దం చెప్పడం. పట్ల రిషి వసు మీద కాస్త సీరియస్ అవుతాడు.మరోవైపు మహేంద్ర దేవయాని మీద రగిలిపోతాడు ‘మీకు రిషితో ఏ సంబంధం లేదు.రిషి నా కొడుకు, రిషి జీవితం గురించి మీరేం ఆలోచించొద్దు’ అంటూ అరిచేస్తాడు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.
రెస్టారెంట్ లో కలిసిన వసు,రిషిలు:
ఇక నేటి కథనంలో రిషి, వసులు రెస్టారెంట్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. ‘వసుధార.. లక్ష్యాలని మార్చుకోవడంలో తప్పేం లేదు మినిస్టర్ గారు అన్నట్లు నువ్వు సివిల్స్కి ట్రై చేయొచ్చుగా’ అంటాడు. ‘సార్ నేను ఒక లక్ష్యాన్ని ప్రేమించాను.. అలాగే నేనొక వ్యక్తిని ప్రేమించాను. నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను సార్.. నా అభిప్రాయాలను మార్చుకోను.. టీచర్ ఉద్యోగంపై నాకు ఎనలేని గౌరవం సార్.. అదే చేస్తాను అని రిషికి క్లారిటీ ఇస్తుంది. ‘వసుధారా నువ్వు మొండిదానివి’ అంటాడు రిషి. వసుధారా.. అభిప్రాయాలు మార్చుకోకపోతే మంచిదే కానీ.. ఆలోచనలు మార్చుకోకపోతే సమస్యలు తెలెత్తడం పక్కా’ అంటూ జగతీ గురుదక్షిణ విషయంలో చెప్పకనే చెప్తాడు
దొంగ నాటకం మొదలుపెట్టిన దేవయాని :
ఇక రిషి ఇంటికి రావడం గమనించిన దేవయాని నాటకం మొదలుపెడుతుంది.కావాలనే.. రిషి వినాలనే ఏంటి ధరణీ.. జగతీ మహేంద్రలను నా మీద అలిగారా తినడానికి రాలేదు’ అంటుంది. రిషి వెంటనే నీ మీద అలగడం ఏంటీ ఏం జరిగింది?’ అంటాడు. అప్పటికే జగతీ, మహేంద్రలు అక్కడికి వస్తారు తినడానికి. మహేంద్ర ఏం లేదు అంటాడు కానీ.. దేవయాని ఏడుపు స్టార్ట్ చేసి జరిగిన విషయం చెబుతుంది. రిషి నా కొడుకు.. నీకేం సంబంధం? రిషి జీవితంలో నీకేం సంబంధం లేదు అన్నాడు మీ నాన్న అని అంటూ ఏడుస్తుంది దేవయాని.వెంటనే రిషి డాడ్ పెద్దమ్మకు సారీ చెప్పండి’ అంటాడు.
పెద్దమ్మకు సారీ చెప్పండి డాడ్ అన్న రిషి :
షాక్ అవుతారు జగతీ, మహేంద్రలు.పాపం మహేంద్ర చాలా సేపు సారీ చెప్పను అనే పట్టుదల మీదే ఉంటారు. రిషి అయితే సారీ చెప్పాల్సిందే అని చెప్పకపోతే అన్నం తినను అనడంతో చెసేది. లేక మహేంద్ర దేవయాని దగ్గరకు వెళ్లి కోపంగా చూస్తూ.. ‘సారీ వదినగారు’ అంటాడు గట్టిగా.
రిషి కోసం దేవయానికి సారీ చెప్పిన మహేంద్ర :
రిషి మెట్ల మీద ఆగుతాడు. వదినగారు నా కొడుకు కోసం నేను ఎన్నిసార్లు అయినా తగ్గడానికి సిద్ధమే అని తనను భోజనం చేయమని అడగండి అని అనడంతో దేవయాని రిషి దగ్గరకు వెళ్లి ఒప్పించి తినడానికి తీసుకొస్తుంది. అప్పుడే మహేంద్ర అక్కడ నుంచి వెళ్లబోతుంటే.. రిషి చేయి పట్టుకుని ఆపుతాడు.
రిషికి ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడిన వసు :
డాడ్ మీరు తినకుండా వెళ్తే నేను తినలేను.. రండి కూర్చోండి ప్లీజ్ అంటాడు.పెద్దమ్మ విషయంలో నేను మిమ్మల్ని బాధపెట్టి ఉంటే సారీ’ అంటూ తినడానికి కూర్చోబెడతాడు.జగతీని కూడా తినడానికి కూర్చోమంటాడు రిషి. ఇక అంతా తింటూ ఉండగా వసుధార ఫోన్ చేసి.. మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి పెట్టేస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!