Cyclone Asani Update: అసాని తుఫాను ప్రభావం నిన్నటి నుండి ఉత్తరాంధ్ర అదేవిధంగా కోస్తా వైపు బలంగా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం తుఫాను ప్రభావం కలిగిన జిల్లాలలో హెచ్చరికలు జారీ చేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎక్కడా కూడా ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. పరిస్థితి ఇలా ఉండగానే అసాని తుఫాను ప్రభావం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక వింత చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నా పల్లి రేవుకు ఒక “బంగారు రధం” దేవాలయం సముద్రంలో కొట్టుకుంటూ వచ్చింది. దీంతో వెంటనే స్థానికులు మరియు మత్స్యకారులు సముద్రం ఒడ్డుకు వచ్చిన ఈ బంగారు రధ దేవాలయాన్ని… భద్రపరచి వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారాన్ని అందించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ ఈ బంగారు రథం ఎక్కడనుండి కొట్టుకు వచ్చింది అన్నది ఇప్పటికీ కూడా సస్పెన్స్ గా ఉంది. గతంలో అనేక పెద్ద తుఫానులు వచ్చినా కానీ ఇటువంటివి రధాలు ఏవి కూడా రాలేదు. ఫస్ట్ టైం… బంగారు రథం సముద్రం ఒడ్డుకు రావటం జరిగిందని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ బంగారు రథం పై విదేశీ భాషల్లో 16-1-2022 అనే కోడ్ ఉంది. దీంతో మెరైన్ పోలీసులు ఈ రథం ఎక్కడ నుండి వచ్చింది అన్న దానిపై విచారణ చేయడానికి రెడీ అవుతున్నారు. చాలావరకు మలేషియా, జపాన్, థాయిలాండ్ వంటి దేశాలలో ఇటువంటి బంగారు రథ దేవాలయాలు ఉంటాయని.. ఆ దేశాలకు సంబంధించిన రథం అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన “అసాని” తుఫాన్ బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా మారింది అని స్పష్టం చేశారు. అసాని ప్రభావం ప్రస్తుతం కోస్తాంధ్ర పై ఉందని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని పేర్కొన్నారు. దింతో దాదాపు గంటకు 80 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇదిలా ఉంటే శ్రీకాకుళం ఒడ్డుకు వచ్చిన ఈ బంగారు రథం దేవాలయాన్ని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా ఒడరేవు ఒడ్డుకు చేరుకుంటున్నారు.