Chiranjeevi: ఏపీలో సినిమా టికెట్ ధర గురించి ఇంక ఇండస్ట్రీ సమస్యల గురించి చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఈరోజు చర్చించడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను అమాంతం ఒక్కసారిగా తగ్గించడంతో… ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఇంకా నిర్మాతలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విషయానికి సంబంధించి ఇండస్ట్రీకి చెందిన రామ్ గోపాల్ వర్మ ఇంకా పలువురు సినిమా నిర్మాతలు గతంలో పలుమార్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చూస్తున్నా పేర్నినాని తో భేటీ అయ్యారు. అంత మాత్రమే కాక కొద్ది వారాల క్రితం ఈ విషయానికి సంబంధించి సీఎం జగన్ ప్రత్యేకంగా చిరంజీవిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించి… చర్చించారు. ఆ సమయంలో సీఎం జగన్ వ్యవహరించిన తీరును చిరంజీవి ఎంతగానో ప్రశంసించారు.
ఖచ్చితంగా సానుకూలమైన స్పందన వైసిపి ప్రభుత్వం నుండి వస్తుందని ఆశించారు. ఈ క్రమంలో మరోసారి సీఎం జగన్ తో భేటీ కోసం అపాయింట్ మెంట్ ఖరారైంది సమయంలో చిరంజీవి తనతోపాటు స్టార్ హీరోలను కొంతమందిని ఆహ్వానించిన క్రమంలో బాలయ్య బాబు ని కూడా ప్రత్యేకంగా పర్సనల్ గా ఫోన్ చేసి ఆహ్వానించారట… కానీ బాలయ్య బాబు చిరంజీవి ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. సినిమా షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉండటంతో బాలయ్య బాబు ఈ సమావేశానికి వెళ్లన్నట్లు టాక్. ఇదిలా ఉంటే చిరంజీవితో పాటు ప్రభాస్, మహేష్… రాజమౌళి మరికొంతమంది ఇండస్ట్రీ పెద్దలు జగన్ తో ఈరోజు భేటీ కానున్నారు.