కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఎండ లో ఎక్కువగా తిరిగిన సరిపడినంత నీరు తీసుకోకపోయినా, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వడదెబ్బ తగిలితే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలం, చలికాలంలోనే వ్యాధులు ఎక్కువగా వస్తాయి అని అందరూ భావిస్తారు. కానీ వేసవిలో తగిలే వడదెబ్బ చాలా ప్రమాదకరమైనది. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. వీటితో పాటు గ్లూకోస్, కొబ్బరి నీరు, నిమ్మరసం,ఎలక్ట్రోరల్ ఫౌడర్, ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి. చక్కెర, ఉప్పు కలిపిన నీరు తీసుకోవచ్చు.
వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.ఎండలో ఎక్కువగా ఉండటం వలన చర్మం కమిలి పోతుంది. చెమట వల్ల కూడా చర్మ సమస్యలు వస్తాయి. వేడి వలన చర్మంపై ఫంగస్ మరింత పెరుగుతుంది.వేసవిలో చర్మ కోసం సన్ స్క్రీన్ వాడటం చాలా మంచిది. టైఫాయిడ్, అతిసారా,కామెర్లతో కూడా వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో ఎక్కువగా ఎదుర్కొనే ఇంకొక సమస్య డీహైడ్రేషన్కు గురవటం. డీహైడ్రేషన్కు గురైనవారికి వికారం ,వాంతులు ,కడుపు నొప్పి ,జ్వరం వస్తాయి. చెమట పట్టకపోయినా,చర్మం పొడిబారినా, మూత్రం రాకపోయినా,నీళ్ల విరేచనాలు అవ్వుతున్న డీహైడ్రేషన్కు గురైనట్లే. వేసవిలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ .
వేసవిలో ఎక్కడిపడితే అక్కడ నీళ్లు తాగకూడదు.బయట తయారు చేసే పండ్ల రసాల్లో ఏ నీరు వాడతారో చెప్పలేం. కాబట్టి ఇంట్లోనే పండ్ల రసాలను చేసుకుని తాగడం మంచిది.ఇంట్లో గర్భిణీ మహిళ ఉన్నట్లయితే నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, ఎలక్టోరల్ ఫౌడర్, గ్లూకోజ్ తాగిస్తూ ఉండండి.ఎండాకాలంలో ఆస్తమా బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు కాలుష్యం, దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరగకపోవడం మంచిది.