తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల హీట్ మొదలైంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, దుబ్బాకలో విజయం సాధించి ఊపు మీద ఉన్న బిజెపి, మళ్లీ తమ పూర్వ వైభవాన్ని పొందాలని కాంగ్రెస్ పోటాపోటీగా తమ నాయకులతో కార్యకర్తలతో సమరానికి సిద్ధమయ్యారు. అయితే ఇదే సమయంలో ఎన్నికల ప్రచార సమయంలో అవకతవకలు కూడా భారీగా జరుగుతున్నాయి. భారీ స్థాయిలో అక్రమంగా మద్యం పంపిణీ. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నగదు పంపిణీ జరుగుతుంది.
ఇక్కడ వీటన్నింటిని అరికట్టేందుకు అటు ఎలక్షన్ కమిషన్ వారితో పాటు, పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీరు, బ్రాందీ, విస్కీ, రమ్ అనే తేడా లేకుండా వీతి పంపకం జరుగుతుంది. దీనికి సంబంధించి నాలుగు ఎఫ్ఐఆర్లు పలుచోట్ల నమోదయ్యాయి. అంతేకాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ 34 లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల రూపాయలు నగదును పట్టుకున్నారు. ఇక మిగతా ఏజెన్సీలు అయితే దాదాపు కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇవి గంజాయి రూపంలో, వివిధ మత్తు పదార్థాల రూపంలో పంపకం జరుగుతుంది.
ఇక మద్యం అయితే లీటర్లు లీటర్లు ఏరులై పారుతోంది. వీటికి తోడు బ్యానర్లు, పోస్టర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు, జెండాలు వంటి వాటిని కూడా ఎన్నికల నిబంధనలను మీరి లేదా అనుమతి లేని చోట్ల ప్రదర్శించినట్లు అయితే వాటిని తీపించివేయడం జరిగింది. ఇక ఇప్పటికే ఎన్నికలకు ముందు పట్టుబడ్డ అక్రమ సొమ్ము 1,35,87, 450 రూపాయలు కావడం గమనార్హం. వీటన్నింటికీ పూర్తి స్థాయిలో చెక్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో ఆపతరం ఎవరివల్లా కాదు.