Bigg Boss 5 Telugu: ఆదివారం “స్టార్ మా” లో బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమం ప్రసారమయింది. ఈ కార్యక్రమానికి సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లు అందరూ హాజరయ్యారు. కానీ షణ్ముక్, సిరి మాత్రం హాజరు కాలేదు. దీంతో సీజన్ ఫైవ్ లో వారిద్దరితో మంచి బాండింగ్ ఫ్రెండ్షిప్ ఏర్పడటంతో జెస్సీ కార్యక్రమం చివరిలో బాగా ఎమోషనల్ అయ్యాడు.
నా బెస్ట్ ఫ్రెండ్స్ షణ్ముక్, సిరి చాలా మిస్ అవుతున్నాను. నా హ్యాండ్ ఇంకా ఖాళీగా ఉంది. ఐ యాం రియల్లీ డేడ్లీ మిస్సింగ్.. బోథ్ ఆఫ్ యూ.. అంటూ జెస్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముక్, జెస్సీ… ముగ్గురే కలిసి ఉండేవారు. మొజ్ రూమ్ లో… డిస్కషన్ ఎక్కువగా పెట్టే వాళ్ళు. దీంతో హౌస్ లో మిగతా కంటెస్టెంట్ లు ఈ ముగ్గురికి త్రిమూర్తులు అనే పేరు కూడా.. పెట్టడం తెలిసిందే.
బిగ్ బాస్ హౌస్ లో..కష్టంలో అయినా బాధ అయినా ముగ్గురు బాగా కలిసి ఉండేవాళ్ళు. ఒకే బెడ్ పై కూడా పడ్డుకునేవాళ్ళు. అయితే జల జెస్సి అనారోగ్యం పాలు కావడంతో.. షణ్ముక్, సిరి బాగా డీప్ అయిపోయారు. దీంతో వీరిద్దరి పై బయట నెగిటివిటీ బాగా క్రియేట్ అయింది. చాలావరకు బిగ్బాస్ మిగతా కంటెస్టెంట్ లో హాజరవుతున్న కానీ ఇద్దరు మాత్రం.. మీడియా కి చాలా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఉత్సవం లో కూడా… మిస్ కావటంతో జెస్సీ ప్రోగ్రాం చివరిలో ఎమోషనల్ కామెంట్లు చేయడం జరిగింది.