టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కెటి రామారావు తరచుగా రాష్ట్ర ప్రజలతో, అతని అభిమానులతో ట్విట్టర్ లో లేదా ఏదో ఒక సోషల్ మీడియా వేదికగా సంభాషిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినా స్పందిస్తారు…. దేని గురించి వివరణ కావాలన్నా ఇస్తారు. అయితే ఈ మధ్యకాలంలో కెసిఆర్ చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ వెనకేసుకొస్తున్న క్రమంలో అతను తన సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు అన్నది తెలంగాణ ప్రజల మాట.
ఇక ప్రస్తుతం నడుస్తున్న ట్విట్టర్ లోని లైవ్ సెషన్ లో మంత్రి కేటీఆర్ కొద్దిగా వివాదాస్పదమైన మరియు నిక్కచ్చిగా ఉండే ప్రశ్నలకు సమర్థవంతంగా సమాధానం చెప్పలేదు అని అనిపిస్తోంది. మొదటిగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఒక ట్విట్టర్ యూజర్ అడిగినప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ ఆ పథకం ప్రారంభం అయితే దక్షిణ తెలంగాణ ఎడారి అయిపోతుంది అన్నారు కెసిఆర్. జగన్ మిత్రత్వం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వాసులకు, వైసీపీ కార్యకర్తలకు ఈ మాటలు పెద్దగా రుచించకపోవచ్చు.
We will fight for our rightful share in Krishna waters. Already an SLP has been filed in Supreme Court by Telangana Govt https://t.co/tQv2Kc3Ykd
— KTR (@KTRTRS) August 9, 2020
What i meant was that we are not in race with any other state
Each state has its own set of challenges and we will work towards combating the pandemic as per WHO and ICMR guidelines https://t.co/k0KUbGOjJR
— KTR (@KTRTRS) August 9, 2020
మాలాగే మరొకరు తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో వహిస్తున్న అలసత్వం గురించి, హెల్త్ బులిటెన్ ఈ విషయంలో చేస్తున్న జాప్యం ఇంకా సరిగ్గా వివరాలు సరిగ్గా నమోదు చేయట్లేదు అని ప్రశ్నించిన ప్రశ్నలకు కేటీఆర్ కొంచం గట్టిగానే బదులిచ్చాడు. ప్రతిరోజు విడుదలవుతున్న బులిటెన్ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాలని కోరిన ఆయన ఒక్కో ప్రభుత్వానికి నివారణ చర్యలు ఒక శైలి ఉంటుందని…. రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా మేలు చేకూరుతుంది అదే విధంగా తాము పని చేసేందుకు మొగ్గు చూపుతామని అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుండి ఎన్నో విషయాల్లో నిర్లక్ష్యం వహించిన విషయాన్ని కేసీఆర్ నిజాయితీగా ఒప్పుకోవడం లేదా తమ వైపు నుండి ఇంకా చాలా జరగాల్సి ఉంది.. అలా చేసి ఉంటే బాగుండేది అని బెరుకు లేకుండా చెప్పాల్సింది అందరి అభిప్రాయం.
Please don’t focus on the negative news
The same Gandhi hospital and its team have treated more than thousands of patients and sent them home safe
They’ve been doing their best
Of course there is scope to improve and we will https://t.co/45qVWITzWI
— KTR (@KTRTRS) August 9, 2020
ఇదిలా ఉండగా ప్రభుత్వం ఏమన్నా ఎక్కువ టెస్టులు చేస్తే అవార్డులు ఇస్తారా అన్నట్టు కేటీఆర్ మాట్లాడిన మాటలకు అందరూ మండిపడుతున్నారు. మొదటి నుండి నివారణ చర్యలు సరిగా చేయకుండా ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన కేసీఆర్ డబ్ల్యూహెచ్వో, ఐసిఎంఆర్ నిబంధనల ప్రకారమే నడుచుకుంటూ… వారి నిర్దేశకాలను పాటిస్తూ తాము నివారణ చర్యలు చేపడుతున్నామని చెప్పడం గమనార్హం. అయితే డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ నిర్దేశకాల్లో ఎక్కువ టెస్టులు చేయవద్దని ఉందా అంటూ ఇప్పుడు మంత్రిని ట్విట్టర్ ప్రజలు ప్రశ్నిస్తుంటే అలాంటి వాటికి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు.