రాజకీయాలు ఏ దశలో కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకసారి గెలుస్తారు.. రెండుసార్లు గెలుస్తారు…. తమ దగ్గర తప్పులు ఉన్నా కూడా మహా అంటే మూడు సార్లు గెలుస్తారు. ఆ తర్వాత ప్రజలకు విషయం అర్థం అయిపోతే ఎన్ని చేసినా పీఠం దక్కే పరిస్థితి లేదు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ మంచి పరిపాలన దర్శకుడిగా నిరూపించుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. ఆతర్వాత ప్రజలే అతడి తిక్క కుదిర్చారు. ఇలా ఏ రాజకీయ పార్టీకి అయినా కనీసం ఐదేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత నచ్చితే ఉండమంటారు లేదంటే పొమ్మంటారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే…. తెలంగాణలో కేసీఆర్ పాలనపై ఇప్పుడు బాగా వ్యతిరేకత వస్తోంది. రెండుసార్లు అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రజలు అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. అందుకు తగ్గట్టు కేసీఆర్ కూడా ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని.. గ్రౌండ్ లెవెల్ లో బాగా నమ్మకం ఏర్పడిపోయింది. సరైన ప్రత్యర్థి లేక టిఆర్ఎస్ కు తప్పక ఓట్లు వేసిన వారి సంఖ్య ఎక్కువ అని సర్వేలు చెబుతున్నాయి. అందుకే 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెల్లుబికి గెలవడం కష్టమనే అంటున్నారు. అందుకోసం కేసీఆర్ స్థానంలో అతడి కొడుకు కేటిఆర్ ను పార్టీ నేతలు సీఎం గా ప్రతిపాదిస్తున్నారు.
ఇక సమయానుకూలంగా స్పందిస్తున్న కాంగ్రెస్ యువనేత రేవంత్రెడ్డి పిసిసి చీఫ్ అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక్కసారి కాంగ్రెస్ అధిష్టానం అతనికి ఆ పదవి కట్టబెట్టిన తర్వాత అతని వేగం మామూలుగా ఉండదు అని రాజకీయ విశ్లేషకులు అంచనా. ఈ నేపథ్యంలో ఇద్దరు యువ నేతలు కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య తెలంగాణ సీఎం కూర్చి దోబూచులాడుతుంది అని చెప్పవచ్చు. ఇక భవిష్యత్తు సీఎం ఎవరు అని ఒక పాపులర్ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని 44.26 శాతం మంది మద్దతు తెలిపా. రేవంత్ రెడ్డికి కేటీఆర్ కు తేడా కేవలం 10 శాతం ఉండడం విశేషం. కాబట్టి ఇద్దరికీ తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు దాదాపు సమాన అవకాశాలు ఉన్నట్లే. ఇక ఉన్న కొద్దికాలం ఎవరైతే ప్రజల మెప్పు పొందుతారో వారిదే సీఎం కుర్చీ అన్నమాట.