Revanth Reddy: ఈ నెల 7న రేవంత్ రెడ్డి కొత్త పీసీసీగా బాధ్యతలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పీసీసీ రథసారథిగా బాధ్యతలు చేపట్టే తరుణంలో పార్టీ రాజకీయాల పట్ల రేవంత్ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. అయితే, రేవంత్ తీసుకోబోయే నిర్ణయంపై చర్చ జరుగుతోంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగే ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు బీజేపీ మినహా.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటి వరకు తమ అభ్యర్థులెవరో ప్రకటించలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తుండగా… కాంగ్రెస్ గురించి చర్చ జరుగుతోంది.
Read More: Revanth Reddy: ఏంటిది రేవంత్ … డబ్బా కొట్టుకోవడం అని అనుకుంటారు
రేవంత్ రెడ్డి ఏం చేయనున్నారు?
ఇటీవలి వరకు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చిన్నమ్మ కుమారుడైన కౌశిక్ రెడ్డికి ఇప్పుడు హుజురాబాద్ టికెట్ వస్తుందా? రాదా అన్నది చర్చనీయంశంగా మారింది. ఈటలకు ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డే మళ్లీ పోటీ చేస్తారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఆయన కొద్ది రోజుల క్రితం కమలాపూర్ మండలంలో ప్రచారం కూడా ప్రారంభించారు. ఇంతలోనే పీసీసీలో మార్పు జరగడంతో కొత్త సారథిగా రేవంత్ రెడ్డి వచ్చారు. దీంతో కథ మొదటికి వచ్చినట్లైంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో మొన్నటివరకు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారనుకున్న పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ ఇవ్వాలంటూ కొత్త నేతలు ముందుకొస్తున్నారు.
Read More: KCR: కేసీఆర్కు ఇంత కులపిచ్చి ఉందా?
దూకుడే డౌట్లు పుట్టిస్తోందా?
ఈటల రాజేందర్ పై అసైన్డ్ భూముల ఆరోపణలు వచ్చిన తర్వాత… కౌశిక్ రెడ్డి వరసగా ప్రెస్ మీట్లు పెడుతూ మాటలదాడికి దిగారు. ఈటలపై కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్ చూపించగా.. కౌశిక్ రెడ్డి విమర్శలు చేస్తూ దూకుడుగా వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి వెనక ఉండి విమర్శలు చేయిస్తోందని కాంగ్రెస్ నేతలు కొందరు ఆరోపించారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరతారని మరికొందరు ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇందులో ఏ వర్గానికి రేవంత్ మద్దతు ఇస్తారని చర్చ జరుగుతోంది.