Shriya: “ఇష్టం” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన శ్రియ .. అతి తక్కువ టైమ్ లోనే మంచి పాపులారిటీ సంపాదించింది. అప్పట్లో చిరంజీవి ఇండస్ట్రీని ఏలుబడి చేస్తున్న సమయంలో టాప్ హీరోలందరి సరసన నటించింది. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లతో మాత్రమే కాకుండా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఆ తర్వాత తరం వారితో కూడా హీరోయిన్ గా చేసి సత్తా చాటింది. శ్రియ కి ప్రస్తుతం అవకాశాలు రాకపోయినా గాని అడపాదడపా సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంది.
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో గెస్ట్ రోల్ చేస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఇండియాలో కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో తన భర్తతో కలిసి స్పెయిన్ వెళ్లిపోయిన శ్రియ.. త్వరలో ఇండియాకి వస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో తెలిపింది. ఇండియాలో కరోనా పరిస్థితి గురించి భగవంతునికి ప్రార్థన చేస్తున్నట్లు, కరోనా కంట్రోల్ అవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.
Read More: Prabhas: ఫుల్ హ్యాపీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..!!
ఎంటర్టెన్మెంట్ రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ తన సన్నిహితులు అంతా క్షేమంగా ఉండాలని.. ప్రజలంతా ఇంటి నుండి బయటకు వెళ్లిన సమయంలో మాస్కులు ధరించాలని సోషల్ డిస్టెన్స్ పాటించాలని శ్రియ కోరడం జరిగింది. కాగా త్వరలోనే ఇండియాలో కి వస్తున్నట్లు వీడియో లో స్పష్టం చేసింది. అదే రీతిలో కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రియ స్పష్టం చేసింది.