బిగ్ బాస్ సీజన్ 4.. 31వ ఎపిసోడ్ లో నిన్న జరిగిన కొన్ని ఘటనలు ఆశ్చర్యకరంగా ఉన్నాయ్. ఇక అందులో ముఖ్యంగా సోహెల్ కెప్టెన్ అవ్వడం. నాలుగు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ 4 లో కెప్టెన్సీ కోసం ప్రతి ఒక్కరు ఓ రేంజ్ లో పోటీ పడుతున్నారు. ఇక అలానే బిబి హోటల్ టాస్క్ పూర్తి అయ్యింది. ఇక ఈ టాస్కులో గెస్ట్ లు విజయతలుగా నిలిచారు. అనంతరం బిగ్ బాస్ కెప్టెన్సీకి ఎవరు అర్హులు అనగా అందులో గంగవ్వ మెహబూబ్ అని చెప్పగా..
అందుకు సోహెల్ వ్యతిరేకించి.. అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని.. ఆతర్వాత మెహబూబ్ ని ఒప్పించినా సోహెల్ కెప్టెన్సీ టాస్క్ లో నిలిచాడు. దీంతో సోహెల్ మొదట ఎంపికవ్వగా, రెండొవ స్థానంలో అఖిల్, సీక్రెట్ టాస్క్ ని విజయవంతం పూర్తి చేసిన ముక్కు అవినాష్ మూడోవ స్థానంలో ఎంపికయ్యి వెళ్లగా మంచు, నిప్పు.. మధ్యలో ఓర్పు అనే పేరుతో కెప్టెన్సీ టాస్క్ ను ఇచ్చారు. ఇక ఇందులో చేతిలో బౌల్ లో మంచు పెట్టి నిల్చోబెట్టగా కింద నిప్పు పెట్టారు.
ఈ కెప్టెన్సీ టాస్కు నుంచి అఖిల్ ఫస్ట్ బయటకు రాగ, కాసేపటికి అవినాష్ కూడా బయటకు వచ్చాడు. దీంతో సోహైల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. కెప్టెన్ గా ఎంపికయినా సోహెల్ కి అందరూ అభినందించగా మెహబూబ్, సోహెల్ కలిసి ఓ రేంజ్ లో అతిగా మాట్లాడారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెహబూబ్ సోహెల్ మాట్లాడుతూ కాయిన్స్ టాస్క్ తర్వాత మనం చాలా స్ట్రాంగ్ అయ్యాం రా.. ఇప్పుడు మనల్ని ఎవరు ఎదురించలేరు.. మన ముందరా అంత తుస్సే అంటూ వారు మాట్లాడారు. దీంతో ఈ మాటలు వైరల్ గా మారాయ్.
Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!