NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విజయవాడలో వారధి రాజకీయం.. ! ఎవరి మాట వారిదే..!!

Kanaka Durga Temple : Whos behind this Scam

 

రాష్ట్రంలో రాజకీయానికి ప్రతిదీ కారణం అవుతోంది. ప్రతిదీ రాజకీయ వివాదం అవుతోంది. తెలుగుదేశం పార్టీ గానీ అటు వైసీపీ గానీ ఎవరికి వారు తమ వాదనలు వినిపించుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే అనేక వాదనలు, వివాదాల మధ్య విజయవాడలోని కనకదుర్గ ఫ్లైవర్ కూడా వివాదానికి కేంద్ర బిందువు గా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎంపి కేశినేని నాని ఒకలా స్పందిస్తుండగా దానికి భిన్నంగా ప్రభుత్వ మంత్రులు చెబుతున్నారు. నిజానికి ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన దుర్గగుడి ఫ్లైఒవర్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో ప్రభుత్వం అయిదు రోజులు సంతాప దినాలుగా ప్రకటించినందున వాయిదా పడింది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సింది పోయి తెలుగుదేశం, వైసీపీ ఎవరికి వారు భిన్నంగా ప్రకటనలు ఇచ్చుకున్నారు. ఆ ప్రకటనల సారాంశం పరిశీలిస్తే ఈ క్రెడిట్ వంతెన వల్ల వచ్చే రాజకీయ లబ్దిని ఇరుపక్షాలు ఎవరికి వారే పంచుకోవాలని చూస్తున్నట్లు ఉంది. అయితే వంతెన నిర్మాణానికి ప్రధాన కారణమైన బిజెపి మాత్రం ఈ వ్యవహారంలో తలదూర్చకుండా సైలెంట్ గా వ్యవహరిస్తోంది. ఈ రోజు విభిన్నంగా విడుదలైన ప్రకటనలు పరిశీలిస్తే…

Kanaka durga flyover

ఎంపి కేశినేని నాని ఏమన్నారంటే …

విజయవాడ కనకదుర్గ ఫ్లైఒవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 18వ తేదీన ప్రారంభిస్తారని కేశినేని నాని పేర్కొన్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ తేదీని ఎంపి కేశినేని నాని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఆర్ అండ్ బి మంత్రి శంకర నారాయణ ఎమన్నారంటే…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రోడ్ల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఏపిఆర్ డిసి) గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. రోడ్ల అభివృద్ధి చేయాలన్న దృక్పదంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు మూడు వేల కోట్లకు పైగా కార్పోరేషన్ ద్వారా అప్పు చేశారనీ విమర్శించారు. చేసిన అప్పు ను రోడ్ల అభివృద్ధికి ఉపయోగించకుండా ఎన్నికల్లో గెలవడం కోసం ఆ నిధులను దారి మళ్లించారని మంత్రి శంకర నారాయణ ఆరోపించారు. మూడు వేల కోట్ల అప్పుకు ఏడాదికి 250 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నామన్నారు. రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు సిఎం జగన్మోహనరెడ్డి మరిన్ని నిధులు కేటాయించారని చెప్పారు. చంద్రబాబు హయాంలో అయిదేళ్లుగా రాష్ట్రంలో రోడ్లు నిరాదరణకు గురి అయ్యాయని విమర్శించారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో పాటు 15 వేల కోట్ల పనులకు ఈ నెల 4వ తేదీన శంకుస్థాపన చేయాల్సి ఉండగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో వాయిదా పడిందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ వీడియో కాన్షరెన్స్ ద్వారా దుర్గమ్మ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఒవర్ ను జాతికి అంకితం చేస్తారని మంత్రి శంకర నారాయణ పేర్కొన్నారు. అదే విధంగా 1500 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!