ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఫ్రిజ్ ఉండటం సర్వసాధారణమే. అయితే ఫ్రిజ్ లో మనం కూరగాయలు తాజాగా ఉండాలని పెడుతూ ఉంటాం. ప్రతిరోజు బజారుకు వెళ్లి తీసుకు రావడం కుదరదు కాబట్టి, వారానికి సరిపడా కూరగాయలు తీసుకొని, ఫ్రిజ్ లో భద్రపరచి ఉంటాం. కూరగాయలు మాత్రమే కాకుండా, గుడ్లు, పాలు మొదలైన వాటిని ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకుంటారు. కానీ ఇలా నిల్వ ఉంచకుండా వాటిని తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉన్న వాటిని తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం.
ఫ్రిడ్జ్ లో అన్ని కూరగాయలను పెట్టినట్టే గుడ్లను కూడా నిల్వ ఉంచుకుంటారు. అలా పెట్టడం వల్ల గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని అనుకుంటారు. కానీ గుడ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల వాటి పెంకు పై సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఆ గుడ్లను మనం తిన్నప్పుడు అంతగా రుచి అనిపించదు. అలాంటి గుడ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కానీ గుడ్లను ఎప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ ఉంచాలి.
గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచిన గుడ్లును తినడం వల్ల రుచితో పాటు, అందులో ఉన్న పోషక విలువలు కూడా మనకు అందుతాయి. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను కూడా తినకూడదు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా అనేది ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. అలా నిల్వ ఉంచిన ఆహారం తినడం వల్ల కొన్నిసార్లు వాంతి, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఫ్రిజ్ లో ఉంచిన టమోటా పండ్లు చాలా గట్టిగా తయారవుతాయి. వీటిని మీరు గమనించే ఉంటారు. వీటి ద్వారా కూర చేసినా అంత రుచిగా అనిపించదు. కనుక ఫ్రిడ్జ్ లో ఉంచడం కన్నా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచడం ఎంతో ఆరోగ్యకరం అని నిపుణులు చెబుతున్నారు.