ఒకప్పుడు సగటు మనిషి జీవిత కాలం సుమారు 90 ఏళ్లు ఉండేవి. ఇప్పుడు సగటు మనిషి జీవిత కాలం 60 ఏళ్లు.. అంతకన్నా తక్కువని చెప్పాల్సి వస్తోంది. అయితే ఇలా మనిషి జీవిత కాలం తగ్గడానికి ప్రధాన కారణం మనం తినే ఫుడ్ అని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. మనం తినే ఆహారం మంచిది కాదు కాబట్టే.. మన శరీరక ధృడత్వం ఇంత వీక్ గా ఉంటుందని సైంటిస్టు లు చెబుతున్నారు. అందుకే చిన్న రోగాలకే హాస్పిటళ్లకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందని చెబుతుంటారు.
అవును మరి మనం తాగే వాటర్ దగ్గరనుంచి తినే తిండి వరకూ అన్నీ మందులతో కలిసినవే.. అవే కాకుండా కల్తీ కూడా జరుగుతుంది. దీని వల్ల సగటు మనిషి ఆయుష్షు రోజురోజుకు పడిపోతుంది. దీనిపై ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా నకిలీరాయుళ్ల పని పట్టలేక పోతున్నారు. కల్తీ లేని ఆహార పదర్థాలు దొరకడమే కష్టంగా మరిపోతుంది. చిన్న పిల్లలకు పట్టే పాలల్లో కూడా కల్తీ జరుగుతోంది అంటే పరిస్తితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు.
మనిషుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ నకిలీరాయుళ్లను ఎంత కట్టడి చేసినా కానీ.. డబ్బులకు ఆశపడే కేటుగాళ్లు ఏదో ఒక రకంగా కల్తీ చేస్తునే ఉన్నారు. సంపాదనే లక్ష్యంగా సాగుతున్న వీరి అక్రమ దందాను ఎవరు ఏమీ చెయ్యలేకపోతున్నారు. ఇప్పుడు ఇలాంటిదే ఒక భారీ మోసం నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు దాడులు చేసి.. నకిలీ ముఠా గుట్టు రట్టు చేశారు.
దగదర్తి మండలం మనుబోలుపాడు గ్రామ శివారులో ఈ దాడులు జరిగాయి. ఇందులో వెలుగు చూసిన వాటిని చూసి ఆఫీసర్లు సైతం షాక్ అయ్యారు. ముందుగా డైరీ ఫామ్ను ఆఫీసర్లు పరిశీలించారు. అందులో భద్రపరిచిన నకిలీ ఆయిల్, పాలపొడి చక్కెర వంటి పదార్థాలను చూసి విజిలెన్స్ ఎస్పీ షాక్ కు గురయ్యారు. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రాజేశ్వర్ రావు తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నకిలీ పాలను సేకరించినట్లు తెలిపారు. పాల ఉత్పత్తి శాతాన్ని పెంచుకునేందుకు బాబురావు అనే వ్యక్తి నకిలీ తయారికి పూనుకున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు బాబురావును అదుపులోకి తీసుకున్నారు. పాల ఉత్పత్తికి ఉపయోగించే సామాగ్రిని సీజ్ చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు.